ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యల కోసం సీఎం చొరవ చూపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేమ నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాగూర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు. సమావేశంలో పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు:
ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు కార్మిక సంఘాలను సీఎం అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆర్టీసీ కార్మికులు కోరుకున్నారని, వారి పోరాటాల్లో తాము ఎప్పుడూ తోడుగా ఉన్నామని అన్నారు. ఆర్టీసీలో నియామకాలు, ఆదాయం పెరిగాయని చెప్పారు. కార్మికుల కృషి వల్లే ఆర్టీసీ దేశంలో ప్రముఖ సంస్థగా నిలిచిందని కొనియాడారు.
గాజులరామారంలో 100 ఎకరాల్లో బస్ టర్మినల్, శంషాబాద్లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టర్మినల్ నిర్మాణ ప్రణాళికలను రూపొందించామని. వెయ్యి ఈవీ బస్సులను కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని, మినీ బస్సులు కూడా ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం డీజిల్పై సుమారు రూ. 2000 కోట్లు ఖర్చవుతున్నాయని, ఆ భారాన్ని తగ్గించేందుకు ఈవీ బస్సులపై దృష్టి పెట్టామని వివరించారు.
ఆదాయం రావాలంటే ఖర్చు తగ్గించుకోవాల్సిందేనని, దీనికి పక్కా ప్రణాళిక అవసరమని తెలియజేసారు. ఆర్టీసీలో ఉన్న బకాయిలు తమ ప్రభుత్వ కాలానికి చెందినవి కాకపోయినా, వాటిని తీర్చేందుకు కృషి చేస్తున్నాం. పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టామని చెప్పారు. ఆర్టీసీ సమస్యలు తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యూనియన్లు, విలీనం వంటి కార్మిక సంఘాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పీఆర్సీ వంటి వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
రాజకీయాలకు లోనైతే సంస్థకు నష్టం జరుగుతుందని. ఆర్టీసీ అప్పులపై వడ్డీ భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బలోపేతానికి కార్మికులు సహకరించాలని సంస్థ. ఒక డ్రైవర్ను కూడా తగ్గించబోమని స్పష్టం చేశారు. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ. 8 వేల కోట్లు ఆర్టీసీకి అందించామని చెప్పారు. సంస్థ అభివృద్ధి కార్మికుల చేతుల్లోనే ఉందని, డిపో మేనేజర్లతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని అధికారులకు సూచించారు.
ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కృషి చేస్తున్నామని, ఈసారి రూ. 1000 కోట్ల బకాయిలు విడుదల చేశామని చెప్పారు. ఆర్టీసీ సమస్యల శాతం 100 పరిష్కరిస్తామని హామీ ఇస్తూ, కార్మికుల వెంటే ఉంటామని చెప్పారు.“సంస్థ ఆగిపోతే అది ఊపిరి ఆగినట్లే. సంస్థకు నష్టం వాటిల్లే చర్యలు చేపట్టాలి,” అని అన్నారు.ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను కాపాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికుల మూడు రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని, సమ్మె సమయంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.
సమ్మె కాలానికి వేతనాలు చెల్లించడం, కేసులను వెంటనే ఎత్తివేయడం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు.
.webp)