ప్రపంచానికే తలమానికంగా నిలిచేలా “ఫ్యూచర్ సిటీ” నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం రాష్ట్ర, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రతిష్టాత్మకంగా “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్నారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీవలప్మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టును గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా వేగంగా సాగుతోందన్నారు. FCDA కార్యాలయ ముఖ్యమంత్రి ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీలపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఫ్యూచర్ సిటీలో తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి నిర్మాణం ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం స్పష్టమైన అంతర్జాతీయ కార్యాచరణతో పనిచేస్తుంది. ప్రస్తుతం వేస్తున్న పునాదులు రాబోయే ఆధునిక తెలంగాణ నిర్మాణాలకు నాంది పలుక అంచనా. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన అనేక ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు ఇండియా అందించాలనే లక్ష్యంతో “యంగ్ స్కిల్స్ యూనివర్సిటీ”ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు తీసుకెళ్లింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎదురైన అనేక సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఫ్యూచర్ సిటీ తెలంగాణకే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుందని, ఈ ప్రాజెక్టుల ద్వారా లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రపంచంలోని అనేక దేశాలు, రాష్ట్రాలు కూడా ఆలోచించని విధంగా తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి.
ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్లో కొనసాగుతున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, పనుల ప్రారంభాన్ని సమీక్షించి అవసరమైన ప్రణాళికలను పరిశీలించి నిర్మాణ పనులను మరింత వేగవంతం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కె. శశాంక, ఐఏఎస్, మహేశ్వరం డీసీపీ కె. నారాయణ రెడ్డి ఐపీఎస్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కారణంగా,
.webp)