తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన తమిళ అగ్రనటుడు, అధినేతగా వెట్రి కళగం విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అధికారికంగా ఆహ్వానించారు.
ఈ ఎన్నికల్లో విజయ్ సాక్షిని టీవీకే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. మ్యాజిక్ ఫిగర్ 118కి స్వల్ప దూరంలో నిలిచాడు, అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు విజయ్ గవర్నర్కు అవకాశం కల్పిస్తుంది. ఇందుకు సానుకూలంగా స్పందించిన రాజ్ భవన్, మెజారిటీ నిరూపించుకోవాలని సూచించూ ఆయనను ఆహ్వానించింది.
దశాబ్దాలుగా తమిళనాట ఏకఛత్రాధిపత్యం చూపిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల ఆధిపత్యానికి విజయ్ ఈ దెబ్బతో గండి కొట్టారు. ముఖ్యంగా డీఎంకే కంచుకోటలను సైతం టీవీకే బద్దలు కొట్టడం. ప్రస్తుతం విజయ్ పార్టీకి కాంగ్రెస్ తన మద్దతు ప్రకటించడంతో ఆయన బలం 113కు చేరింది. ఇతర చిన్న పార్టీలు మరియు స్వతంత్రుల మద్దతుతో సునాయాసంగా మేజారిటీ మార్కును అందుకుంటామని టీవీకే వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసింది టీవీకే పార్టీకి కాంగ్రెస్ అధికారిక మద్దతు. విజయ్ ప్రకటనని టీవీకే మద్దతు తెలుపుతూ ఏఐసీసీ తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
47 స్థానాలను గెలుచుకున్న అన్నాడీఎంకేలో ఇప్పుడు భారీ ‘ముసలం’ మొదలైంది. పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలుటీవీకే పార్టీ వైపు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చెన్నైలోని పార్టీ నేత సీనియర్ సీవీ షణ్ముగం సుమారు 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా విజయ్కి మద్దతుగా ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
విజయ్ రాకతో తమిళనాడులో 62 ఏళ్ల ద్రావిడ పార్టీల పాలనకు బ్రేక్ పడింది. ఆయన ముఖ్యమంత్రిగా మే 7వ తేదీన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం ఇప్పటికే ఈ చారిత్రక వేడుక కోసం ముస్తాబవుతోంది. విజయ్ తన క్యాబినెట్లో యువతకు, విద్యావంతులకు పెద్దపీట వేశారు.
ఈ పరిణామంపై తమిళనాట హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య ప్రజలు మార్పును కోరుకున్నారని, విజయ్ రాకతో కొత్త తరహా రాజకీయాలు మొదలవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు, ప్రతిపక్షాలు ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాలని విమర్శలు గుప్పిస్తున్నాయి.
తమిళనాడును ప్రగతి పథంలో నడిపిస్తానని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తానని విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరి కొద్ది గంటల్లోనే ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
.webp)