
ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం
తప్పుడు ప్రచారంతో రైతుల్లో ఆందోళనకు యత్నం
వరుస ఎన్నికల్లో ఓటమీ పాలైన కనువిప్పు కలగలేదు
అకాల వర్షాలు, హీట్ వేవ్స్ నుంచి రక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
95 లక్షల మె. ట ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ధాన్యం కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తూ.. రైతులను ఆందోళనకు గురిచేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన ప్రతిపక్ష నేతలకు కనువిప్పు కలగ. తమ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యాన్నిసేకరిస్తోందన్నఆయన రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో లేవని తప్పుడు ప్రచారం ప్రచారం. ప్రస్తుతం 2.63 లక్షల టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి… ప్రస్తుతం అకాల వర్షాలు, తీవ్రమైన ఎండల (హీట్ వేవ్) నుంచి ధాన్యాన్ని, రైతులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రభుత్వమే ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రతి గింజను రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తోందని చెప్పారు. ఈ రబీలో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల ఎకరాల్లో సాగు అయిందనీ దాదాపు 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు. ఇందులో భాగంగా 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 17.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 64.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే సామర్ధ్యం ఏర్పాటు చేశామన్న మంత్రి… అదనంగా 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ కోసం గోదాములు గుర్తించినట్లు చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు గాను 6,200 వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు దాహార్తి తీర్చేందుకు వీలుగా తాగునీరు, ఓఆర్ఎస్ సరఫరా అందిస్తుంది. ఏదైనా ప్రమాదాల్లో రైతులు కొనుగోలు కేంద్రాల్లో చనిపోతే తక్షణమే పరిహారం అందజేసినట్లు వివరించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం పూట కొనుగోలుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అకాల వర్షపాతం రైతులు,సిబ్బంది చెట్లు కింద ,కరెంట్ స్తంభాల దగ్గర ఉంటే పిడుగుపాటుకు గురి కాకుండా సూచనలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాష్ట్ర స్థాయి నోడల్ అధికారితో పర్యవేక్షణ జరిగింది. అన్నింటికీ మించి ధాన్యం కొనుగోలు అంశంపై ప్రత్యేకించి పౌర సరఫరాల శాఖ కేంద్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించకుండా టోకెన్లు ఇస్తున్నారు.