ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష..
కూలీల ఆరోగ్యం పట్ల అధికారులు జాగ్రత్తలు పాటించాలి..
మే మాసంలో మూడున్నర కోట్ల పనిదినాలు పూర్తి చేయాలి..
ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గ్రామీణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డీఆర్డీఓలు, ఎంపీడీవోలు మరియు సంబంధిత అధికారులతో ములుగు నుంచి మంత్రి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మే మాసం ఉపాధి హామీ పథకం అమలులో అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఉపాధి కోరిన ప్రతి కుటుంబానికి పనిని కల్పించడం ప్రధాన లక్ష్యంగా సిబ్బంది కృషి చేయడం. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి పనులపై అధికంగా డిమాండ్ ఉన్నందున, సాంకేతికత, ఇతరత్రా అధిగమించి ప్రతి పని అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మే మాసంలో కనీసం మూడున్నర కోట్ల పనిదినాలను పూర్తి చేయాలని నిర్ణయించుకోవాలని మంత్రి సూచించారు. ఏప్రిల్ మాసంలో అధికారులు యజ్ఞంలా పనిచేసి కోటిన్నర పనిదినాలను పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం పంట కోతలు ముగియడంతో ఉపాధి కూలీ పనులకు డిమాండ్ మరింత పెరుగుతుందని, అర్హులైన అన్ని కుటుంబాలకు ఉపాధి కల్పించాలని స్పష్టం చేశారు.
ఎండలు తీవ్రంగా ఉన్న పని ప్రాంతాల కూలీలకు తాగునీరు, నీడ, ఫస్ట్ ఎయిడ్ వంటి మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా కల్పించాలని. కూలీల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉపాధి పనులు నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా, తీవ్ర ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు నిర్వహించేలా ప్లాన్ చేయాలని సూచించింది.
అలాగే తక్కువగా ఉపాధి పనులు జరుగుతున్న మండలాలు, గ్రామ పంచాయతీలను స్వయంగా పర్యవేక్షించాలని, పనిదినాల లక్ష్య సాధనకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రతి హ్యాబిటేషన్లో పనులు ప్రారంభించడం, ప్రతి ఉపాధి కోరుకునే వ్యక్తికి పని కల్పించడం, ప్రతి పని ప్రదేశంలో తగిన సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు.
ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 20 ఉపాధి పనులు ఉంచడం, ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్ను నియమించడం, ప్రత్యేక అధికారులు నియమించిన పనుల ప్రణాళిక ప్రణాళిక వంటి పనులను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి సీతక్క సూచించారు. గ్రామ స్థాయిలో సర్పంచ్లతో కలిసి ఉపాధి కోరే కూలీలతో సమావేశాలు నిర్వహించి అవగాహన పెంచాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సమర్థంగా సాధించాలని మంత్రి సీతక్క అధికారులను నియమించారు.
