Home సినిమా పరాశక్తి మూవీకి రూ.50 కోట్ల నష్టం రాకుండా నిర్మాత ప్లాన్.. ఎలాగో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! – Andhra Waves

పరాశక్తి మూవీకి రూ.50 కోట్ల నష్టం రాకుండా నిర్మాత ప్లాన్.. ఎలాగో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo



– ఫ్లాప్ అయినా సేఫ్ జోన్‌లో ‘పరాశక్తి’ ప్రొడ్యూసర్

– నష్టాల నుంచి గట్టెక్కిన సినిమా!

– భారీ బడ్జెట్ సినిమా.. తక్కువ వసూళ్లు

టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బడ్జెట్ లెక్కలు తలకిందులవుతున్నాయి. భారీ అంచనాలతో రూపొందించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే నిర్మాతలు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ చిత్రం విషయంలోనూ ఇదే జరిగింది. దాదాపు 150 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ సినిమా కేవలం 80 నుంచి 100 కోట్ల లోపు వసూళ్లతోనే సరిపెట్టుకుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వస్తే నిర్మాతకు 50 కోట్లకు పైగా నష్టం రావాలి, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది.

ప్రముఖ నిర్మాత జి. ధనుంజయన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా భారీ నష్టాల్లో నిర్మాత సేఫ్ జోన్‌లో ఉండటానికి ప్రధాన కారణం వారు అనుసరించిన ‘ప్రాఫిట్ షేరింగ్’ (లాభాల్లో వాటా) పద్ధతి. ఈ విధానం వల్ల నిర్మాతపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, నష్టాలను అందరూ పంచుకునే అవకాశం కలిగింది. ముఖ్యంగా హీరో శివకార్తికేయన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా అగ్ర హీరోలు సినిమా మొదలవ్వకముందే తమ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ‘పరాశక్తి’ కోసం శివకార్తికేయన్, జయం రవి, మరియు దర్శకురాలు సుధా కొంగర కేవలం టోకెన్ అమౌంట్ మాత్రమే తీసుకున్నారు. మిగిలిన రెమ్యునరేషన్ సినిమా బిజినెస్ మరియు కలెక్షన్స్ ఆధారంగా అంగీకరించారు. ఉదాహరణకు ఒక హీరో రెమ్యునరేషన్ 50 కోట్లు అనుకుంటే, ముందుగా ఒక 20 కోట్లు మాత్రమే తీసుకుంటే, మిగిలినది సినిమా ఫలితం ఆధారంగా సెటిల్ చేసుకునే ఈ పద్ధతి నిర్మాతలకు వరంగా మారింది.

గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి వారు ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవారు. ఇప్పుడు శివకార్తికేయన్ కూడా అదే బాటలో నడవడం విశేషం. నటినటులు తమ పూర్తి పారితోషికాన్ని ముందే వసూలు చేసి ఉంటే, నిర్మాతలకు సుమారు 50 కోట్ల భారీ గొయ్యి పడేది. కానీ ఈ షేరింగ్ పద్ధతి వల్ల ఆ నష్టం హీరో, దర్శకులకు కూడా వర్తించడంతో నిర్మాత ఆర్థికంగా కుప్పకూలిపోకుండా నిలబడగలిగారు.

ఈ విషయంపై నెత్తింట భిన్నమైన చర్చలు సాగుతున్నాయి. హీరోలు కేవలం భారీ రెమ్యునరేషన్లు తీసుకోవడమే కాకుండా, సినిమా బాధ్యతను కూడా భుజాన వేసుకోవాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. హీరోలు షూటింగ్‌కు రావడం, ప్రమోషన్లలో పాల్గొనడం వంటి విషయాల్లో కూడా ఈ విధానం వల్ల క్రమశిక్షణ పెరుగుతుందని ధనుంజయన్ చెప్పారు. పారితోషికం మొత్తం చేతికి అందిన హీరోలు కూడా సినిమా ప్రమోషన్ల కోసం కష్టపడతారని, ఇది ఇండస్ట్రీ ఆరోగ్యానికి మంచిదని ఆయన చెప్పారు.

మొత్తానికి ‘పరాశక్తి’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన హిట్ అందుకోకపోయినా, బిజినెస్ మోడల్ పరంగా మాత్రం కొత్త పాఠాలను నేర్పింది. రాబోయే రోజుల్లో మిగిలిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఇదే బాటలో నడిస్తే నిర్మాతలు ఆత్మహత్యల దిశగా వెళ్లే పరిస్థితి ఉండదని సినీ విశ్లేషకులు. శివకార్తికేయన్ తన తదుపరి సినిమాలకు కూడా ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తారా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ షూటింగ్‌లో దాదాపుగా ఉన్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird