ఏపీలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న ఎండలు, అధిక స్థాయి ప్రభావం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉక్కబోతలు, ఎండవేడిమి కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రతి ఏడాది ఈసారి కూడా మార్నింగ్ స్కూల్స్ అమలు చేయనున్నారు.
ఇక తెలంగాణలోనూ మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఒంటిపూట బడులు అమల్లోకి రానున్నాయి.
