తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయ సెంటిమెంట్, పవన్ కళ్యాణ్ సభల చుట్టూ తీవ్రమైన రాజకీయ దుమారం రేగుతోంది. హైదరాబాద్లో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్మాణం తలపెట్టిన “నవ సంకల్ప సభ” ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ఈ సభను ఉద్దేశించి కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయంగా కాక పుట్టించాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే సభ పెట్టుకోవాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేయగా, కవిత మరింత ఘాటుగా స్పందించారు. గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాబోతున్నాయని కవిత తెలియజేసారు. ఇంకా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య తెలుగువన్ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కవిత, పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ పేరు వింటేనే కొందరికి భయం పట్టుకుంది, అందుకే ఈ స్థాయిలో టార్గెట్ ఉందని ఆయన ఉన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ పార్టీ సభ పెట్టుకోవడానికి వీల్లేదన్నట్లు మాట్లాడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ గతంలో ఒరిస్సా, మహారాష్ట్రలో బీఆర్ఎస్ పేరుతో సభలు పెట్టలేదా అని బాలకోటయ్య నిలదీశారు. తెలంగాణ వాదులుగా చెప్పుకునే కొందరు నాయకులు తాలిబాన్లలా మాట్లాడుతున్నారు, ఇది తీవ్రమైన రాజకీయ ఉన్మాదమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని చేతకాలేదన్న కవిత వ్యాఖ్యలకు బాలకోటయ్య గట్టి కౌంటర్ ఇచ్చారు. అమరావతి రాజధాని కోసం 28,000 మంది రైతులు సుమారు 34,000 ఎకరాల భూములను త్యాగపూర్వకంగా ఇచ్చారని, అది ధీరోదాత్తమైన రాజధాని అని గుర్తు చేశారు. లిక్కర్ కేసుల్లో ఇరుక్కున్న కవితకు అమరావతిని విమర్శించే అర్హత లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులను రైతులకు సహాయంగా అందించిన గొప్ప నాయకుడని, ఆయనపై ఒక్క అవినీతి కేసు కూడా లేదని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎలాంటి ఆధారాలు (సోర్స్) లేకుండా అమిత్ షా, పవన్ కళ్యాణ్లపై చేసిన బేస్లెస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాగేశ్వర్ తన తప్పు తెలుసుకుని వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా, కొందరు ఇంకా వివాదాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలపడుతుందనే భయంతోనే ఈ ముందస్తు రాజకీయ దాడులు జరుగుతున్నాయని బాలకోటయ్య గుర్తించారు. 2004లో రాజశేఖర్ రెడ్డితో, 2009లో చంద్రబాబు నాయుడితో పొత్తులు పెట్టుకున్న చరిత్ర టీఆర్ఎస్కు లేదా అని గుర్తు చేశారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించింది 1,200 మంది సాదాసీదా అమాయక బిడ్డలే తప్ప కేసీఆర్ కుటుంబంలో ఎవరూ ఆత్మబలిదానం చేసుకోలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయం కోసం ప్రాంతాల మధ్య, కులాల మధ్య వైషమ్యాలు వారిని ప్రజలు త్వరలోనే తిప్పికొడతారని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సభ ఖచ్చితంగా జరిగి తీరుతుందని, బెదిరింపులకు జనసేన భయపడదని బాలకోటయ్య స్పష్టం చేశారు.
.webp)