తెలంగాణ సచివాలయం వద్ద ఉధృత వాతావరణం నెలకొని ఉంది. రైతులకు న్యాయం చేయాలంటూ సచివాలయం వద్ద ఆందోళనకు దిగిన కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారింది. ఈరోజు ఉదయం నుంచే భారీ సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతు సంఘాల నాయకులతో పాటు కవిత సచివాలయం వద్దకు చేరుకొని రైతుల రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, సాగునీటి సమస్యలు, భూసంబంధిత ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.
“రైతు బతికితేనే రాష్ట్రం బతుకుతుంది” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అక్కడికి చేరుకున్న కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉండటంతో అక్కడ పరిస్థితి క్రమంగా ఉద్రిక్తంగా మారింది.సచివాలయం వైపు కదిలేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచే సుకుంది. నినాదాలతో సచివాలయం పరిసరాలు మార్మోగిపోయాయి.
ఒకవైపు రైతుల సమస్యలను పరిష్కరించాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తుండగా, మరోవైపు చట్టం-శాంతి భద్రత కారణంగా నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగి కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకున్నారు. ఆమె అరెస్టును అడ్డుకు నేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు కవితను పోలీసు వాహనంలో ఎక్కించి ఫలక్నుమా పోలీస్ స్టేషన్కు.
అరెస్టుకు ముందు కవిత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “రైతుల కోసం మాట్లాడితే అరెస్టులా..? రైతు సమస్యలు అడిగితే నేరమా..?” అంటూ ఆమె ప్రశ్నించారు. రైతుల కోసం తమ పోరాటం ఆగదని, ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ ఘటనతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కవిత అరెస్టును టీఆర్ఎస్ నేతలు ప్రజాస్వామ్య హక్కుల హననంగా అభివర్ణిస్తుండగా, ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
