Home క్రీడలు ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం- మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు – Andhra Waves

ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం- మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు – Andhra Waves

by
0 comments
ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం- మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు


 

సూర్యాపేట జిల్లా ప్రతినిధి;

ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. జిల్లా ఆసుపత్రి జే ఫంక్షన్ హాల్లో మాదిగల ఓట్లు మాదిగలకే అనే నినాదంతో మాదిగ మహాశక్తి నాయకులు సాగరపు ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రంలో 70 లక్షల మంది మాదిగల బతుకులు మారడం లేదని అగ్రకులాల రెడ్లు, కమ్మలు వెలమలు, అధికారాన్ని చలాయిస్తూ మాదిగలు, బహుజన కులాలను పావులుగా, ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగల ఓట్లు మాదిగలకే వేసుకుంటే మన సత్తా ఏంటో తెలుస్తదని ఓటుకి ఎంత బలం ఉందో అగ్రకులాల కు వణుకు పుడుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 50 మందికి పైగా మాదిగలు ఉన్నారని మన ఓట్లు మనమే వేసుకుంటే బీసీల సహకారంతో మాదిగలు రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మాదిగల మహాశక్తి జండా ఎగరాలని రిజర్వేషన్లు ఉన్న ఫలాలు అందటంలో పాలకులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మాల కుటుంబాలకే, సీట్లు మంత్రి పదవులు దక్కాయని ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, ప్రొఫెసర్ కనకయ్య, దుర్గయ్య గౌడ్, బండారు సుధాకర్, కేవీ, మాచర్ల సైదులు, డేవిడ్, మస్తాన్, దయానంద, జయశంకర్, సూరయ్య ఉన్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird