ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో జనని వివాహం జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన నిశ్చితార్థ సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, దర్శకుడు శ్రీను వైట్ల, నటుడు శివాజీ, రచయిత కోన వెంకట్, నిర్మాత సి. కల్యాణ్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విచ్చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు.
ఇదిలా, ఈ నిశ్చితార్థ వేడుకలో ఆసక్తికర సన్నివేశం ఉండగా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరినొకరు ఎదురుపడ్డారు. వేడుకకు దాదాపు ఒకే సమయంలో చేరుకున్న వీరు, రాజకీయాలను పక్కనపెట్టి ఆత్మీయంగా పలకరించుకున్నారు.
చంద్రబాబు కనిపించగానే ఎర్రబెల్లి దయాకర్ రావు ముందుకు వెళ్లి ఆయనకు నమస్కరించారు. చంద్రబాబు కూడా ఆయన భుజం తట్టి ప్రతినమస్కారం చేశారు. అనంతరం ఇద్దరూ స్వల్పంగా మాట్లాడుకుని తమ తమ దారులు పట్టారు.
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయకత్వంలో సుదీర్ఘకాలం పనిచేశారు, ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో కొనసాగుతున్న ఆయన, టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు.
