డిసెంబర్ 16, 2025 2:38PMన పోస్ట్ చేయబడింది

ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీబీచ్ కాల్పులకు తెగబడి నరమేథం సృష్టించిన నిందితుడి వద్ద ఇండియన్ పాస్ పోర్టు లభించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో నిందితుడు సాజిత్ అక్రమాస్తుల వద్ద ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.సాజిత్ అక్రమ హైదరాబాద్ నుంచి పాస్పోర్ట్ పొందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతే కాకుండా, అతడు హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాకిస్థాన్కు నిఘా ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ప్రయాణాల వెనుక ఉద్దేశాలు ఏమిటన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇలా సాజిత్ వద్ద లభించిన పాస్పోర్ట్ వివరాలు హైదరాబాద్ చిరునామాతో ఉండటంతో భారత కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అతడి కుటుంబ సభ్యుల వివరాలు, నేపథ్యం తదితర నిఘావర్గాలు కూపీలాగుతున్నాయి. ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకోవడంతో, భారతదేశం– ఆస్ట్రేలియా అధికారుల మధ్య సమన్వయంతో మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
