పశ్చిమ బెంగాల్ లో కమలం అధికారంలోకి రావడంతో.. ఆ ప్రభావం రాష్ట్ర సరిహద్దులకే పరిమితం కాకుండా పొరుగు దేశమైన బంగ్లాదేశ్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికార పీఠాన్ని అధిరోహించడం బంగ్లాదేశ్లో పెను సామాజిక మరియు రాజకీయ మార్పులకు దారితీస్తుందనే చర్చ అంతర్జాతీయ స్థాయిలో మొదలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బెంగాల్లో బీజేపీ గెలిస్తే బంగ్లాదేశీయులను వెనక్కి పంపుతారనీ.. దీంతో భారీ శరణార్థుల సంక్షోభం తలెత్తుతుందని ఆయన హెచ్చరించారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార పర్వంలో ఒవైసీ చేసిన వ్యాఖ్యలు భారత అంతర్గత రాజకీయాలను బంగ్లాదేశ్ భౌగోళిక రాజకీయాలతో అనుసంధానించాయి. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే.. వారు అక్కడ ప్రతి బంగ్లాదేశీయుడిని తిరిగి పంపిస్తారు. దీనివల్ల మన పొరుగున ఉన్న దేశంలో పెద్ద ఎత్తున శరణార్థుల సమస్య తలెత్తుతుంది అని ఒవైసీ అన్నారు. ఈ ప్రకటన వెనుక కేవలం విమర్శ మాత్రమే లేదు.. ఒక రకమైన సామాజిక ఆందోళన కూడా మొదలైంది. ముఖ్యంగా ముస్లింమైనారిటీల పట్ల బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, సిఏఏ, ఎన్నార్సీ వంటి అంశాలు ఈ భయాలకు ఆజ్యం పోస్తున్నాయి.
దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అక్రమ వలసలు’ అనేది ఒక కీలకమైన అంశం. సుమారు నాలుగువేల సంవత్సరాలకు పైగా ఉన్న భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులలో అధిక భాగం పశ్చిమ బెంగాల్తోనే ముడిపడి ఉంది. 1971 విముక్తి యుద్ధం సమయం నుండి మొదలైన శరణార్థుల ప్రవాహం.. ఆ తర్వాత ఆర్థిక కారణాలతో కొనసాగుతూనే ఉంది. బీజేపీ తన రాజకీయ నారేటివ్లో బెంగాల్ను అక్రమ వలసల వల్ల జనాభా మార్చబడిన రాష్ట్రంగా చిత్రీకరిస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే, సరిహద్దు భద్రతా (బీఎస్ఎఫ్) పరిధిని పెంచడం, కంచె నిర్మాణాన్ని వేగవంతం చేయడం, అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి వెనక్కి పంపడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతూ వస్తోంది.
పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయడం బీజేపీకి ప్రధాన అస్త్రం. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని కేంద్రం చెబుతున్నప్పటికీ.. ముస్లిం వర్గాల్లో మాత్రం ఎన్నార్సీ పట్ల తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సరైన పత్రాలు లేని వారిని సందేహాస్పద పౌరులుగా గుర్తించి డిటెన్షన్ కేంద్రాలకు పంపుతారనే ప్రచారం బలంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒవైసీ వంటి నాయకులు, బీజేపీ విధానాల వల్ల బెంగాల్లో లక్షలాది మంది ముస్లింల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని, అది నేరుగా బంగ్లాదేశ్పై ఒత్తిడి పెంచుతుందని వాదిస్తున్నారు.
ఇక బంగ్లాదేశ్లోని రాజకీయ విశ్లేషకులు కూడా బెంగాల్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. భారత్లో జరిగే జనాభా గణన లేదా పౌరసత్వ నిర్ధారణ ప్రక్రియ వల్ల తమ దేశంలో లక్షలాది మందిని బలవంతంగా తోసివేస్తారేమోనని వారు భయపడుతున్నారు. ఇప్పటికే రోహింగ్యా శరణార్థుల సమస్యతో సతమతమవుతున్న బంగ్లాదేశ్కు, ఇప్పుడు బెంగాల్ నుండి కొత్తగా శరణార్థుల ప్రవాహం మొదలైతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదం ఉంది. సామాజికత దెబ్బతినడమే కాకుండా, అంతర్గత అస్థిరతకు కూడా ఇది దారితీయవచ్చు.
భారత ప్రభుత్వం ఒకవైపు బంగ్లాదేశ్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కాపాడుకుంటూనే, మరోవైపు సరిహద్దు భద్రతపై రాజీ పడకూడదని భావిస్తోంది. చైనా అడ్డుకోవడానికి బంగ్లాదేశ్ సహకారం భారత్కు ఎంతో ముఖ్యం. అయితే.. రాజకీయ అంతర్గత అవసరాల కోసం అక్రమ వలసదారులపై తీసుకునే చర్యలు అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన ఇబ్బందులను సృష్టించే అవకాశం ఉంది. ఒవైసీ వ్యాఖ్యలు ఈ సున్నితమైన ప్రపంచ దృష్టికి తీసుకెళ్లాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రమే నిర్ణయించాయి. అవి దక్షిణాసియా ప్రాంతీయ భద్రతను, భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను, శరణార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. రాజకీయ ప్రకటనలలో అతిశయోక్తి ఉండవచ్చు కానీ, సరిహద్దు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణలు దేశంలో కీలక వేరియబుల్స్ అనడంలో సందేహం లేదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ వివాదం మున్ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
-సీతారాం కంఠంనేని
సూచనలు
ది హిందూ, ఫ్రంట్లైన్ – పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మరియు అక్రమ వలస రాజకీయాలు
ORF (అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్) – CAA–NRC, బంగ్లాదేశ్ మరియు భారతదేశ పొరుగు విధానం
IDSA – భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు నిర్వహణ మరియు వలస సమస్యలు
ఎకనామిక్ & పొలిటికల్ వీక్లీ – పౌరసత్వం, NRC మరియు అస్సాం మరియు బెంగాల్లో మినహాయింపు రాజకీయాలు
ఈ విశ్లేషణ మీకు నచ్చిన https://www.teluguone.com ను ఫాలో అవ్వండి. భాగస్వామ్యం చేయండి. మీ అభిప్రాయాలను తెలియజేయండి.
.webp)