హైదరాబాద్లో నమోదైన ఫోక్సో కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దర్యాప్తులో కీలక అంశమైన బాధితురాలి వయస్సుపై స్పష్టత రావడంతో మరింత సీరియస్ దశలోకి తీసుకెళ్లారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బాధితురాలు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్లు జనన ధృవీకరణ పత్రం సమర్పించారు. ఆ పత్రాన్ని ఆధారంగా తీసుకుని సంబంధిత సంవత్సరానికి చెందిన జీహెచ్సి జనన రికార్డులను పరిశీలించగా, ఆమె మైనర్ అని నిర్ధార ణ అయ్యింది. ఈ నిర్ధారణ కేసు దర్యాప్తులో కీలక మలుపుగా.
ఇదే సమయంలో ఈ వ్యవహారం న్యాయపరంగా కూడా వేడెక్కింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఫోక్సో కేసు నేపథ్యంలో తన పేరు, ఫోటోలు, వీడియోలు భవిష్యత్తులో ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వడానికి ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికల్లో తన పేరుతో ప్రచారంలో ఉన్న వీడియోలను తొలగించేందుకు కూడా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కోర్టును ఆదేశించారు.
తన ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రచారం జరుగుతోందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ స్పందనలు, సోషల్ మీడియా చర్చలు, న్యాయపరమైన పరిణామాలు… అన్నీ కలిసి ఈ కేసును రాష్ట్రంలో హాట్ టాపిక్గా మార్చేశాయి. ఇకపై దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది? కోర్టు నుంచి వచ్చే తదుపరి ఆదేశాలు ఏమిటి? అనే ఆసక్తి దానిపై.
