తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు సుగమం చేస్తూ.. విడుదలై చిరుత్తైగల్ కట్జి పార్టీ విజయ్ కు మద్దతు ప్రకటించారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను కోరారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది. దీంతో విజయ్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ లభించింది. ఈ పరిణామంతో విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.
ఇప్పటికే టీవీకే పార్టీకి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీసీకే కూడా తోడవడంతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందిగ్ధత తొలగిపోయింది.
.webp)