ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమెను రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు అనుమతినిచ్చింది.బప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న శాంతిని, తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఏసీబీ అధికారులు కోర్టును హాజరుపరిచారు. విచారణ విచారణ జరిపిన న్యాయస్థానం శుక్ర, శనివారాలు ..రెండు రోజుల పాటు శాంతిని ఏసీబీ కస్టడీకి తీసుకోవడానికి అనుమతించింది. ఆమె అక్రమంగా కూడబెట్టినట్లుగా ఆస్తులు, బినామీ వ్యవహారాల గురించి అధికారులు ఆమెను లోతుగా ప్రశ్నించనున్నారు.
ఈ నెల ప్రారంభంలో ఏసీబీ అధికారులు భారీగా నిర్వహించిన సోదాల్లో శాంతికి సంబంధించి అక్రమ ఆస్తులు వెలుగు చూశాయి. తాడేపల్లి, విశాఖపట్నం సహా పలు చోట్ల నిర్వహించిన సోదాల్లో సుమారు 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, ఒక భవనం, ఫ్లాట్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆమె రిమాండ్ను మే 5వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో, నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఆమెను ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్ చేసింది. 2020లో దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా చేరిన శాంతి, గతంలో కూడా కొన్ని వివాదాల కారణంగా సస్పెన్షన్కు గురై, ఇటీవల విధుల్లో చేరాల్సి ఉండగా ఈ కేసులో చిక్కుకున్నారు. ఏసీబీ అధికారులు ఈ రెండు రోజుల కస్టడీలో మరిన్ని కీలక ఆధారాలు సేకరించే అవకాశం కనిపిస్తోంది.
