Home సినిమా అనసూయకు ఘోర అవమానం.. అర్థరాత్రి భర్త దగ్గర వెక్కి వెక్కి ఏడ్చానంటున్న రంగ’మ్మ’త్త! – Andhra Waves

అనసూయకు ఘోర అవమానం.. అర్థరాత్రి భర్త దగ్గర వెక్కి వెక్కి ఏడ్చానంటున్న రంగ’మ్మ’త్త! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ సంపాదించుకుని, ఆ తర్వాత వెండితెరపై విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బయటకు ఎంతో ధైర్యంగా, బోల్డ్‌గా కనిపించే ఈ స్టార్ యాంకర్.. తన కెరీర్ ఆరంభంలో చిత్ర పరిశ్రమలో ఎదురైన తీవ్ర అవమానాల గురించి పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

ఒకానొక దశలో టాలీవుడ్‌కు చెందిన మూడు భారీ ప్రాజెక్టులలో అనసూయను ముఖ్యమైన పాత్రల కోసం ఎంపిక చేశారట. తరుణంలో దాదాపు అన్నీ ఖరారయ్యాయి.. ఎలాంటి ముందస్తు సమాచారం కానీ, కనీస వివరణ కానీ ఇవ్వకుండా ఆ మూడు సినిమాల నుండి ఆమెను అర్ధాంతరంగా తొలగించినట్లు తెలిపారు. తానేం తప్పు చేశానో కూడా చెప్పకుండా అలా దూరం పెట్టడం తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ అనసూయ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సినిమాల నుంచి తనను తొలగించారని తెలిసిన రోజు రాత్రి ఆ వేదనను అస్సలు భరించలేకపోయానని, అర్థరాత్రి రెండు గంటల సమయంలో తన భర్త భరద్వాజ్ దగ్గర చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చేశానని చెప్పుకొచ్చారు. ఆ క్లిష్ట సమయంలో తన భర్త ఇచ్చిన మానసిక ధైర్యమే తనను మళ్లీ నిలబెట్టిందని స్పష్టం చేశారు.

కెరీర్ ప్రారంభంలో ‘క్షణం’, ‘సోగ్గాడే చిన్నినయన’ వంటి చిత్రాలు అనసూయకు నటిగా మంచి గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ఆమె పోషించిన ‘రంగమ్మత్త’ పాత్ర ఆమె సినీ ప్రస్థానాన్ని మలుపు తిప్పింది. ఈ చిత్రం తెచ్చిపెట్టిన క్రేజ్‌తో పుష్పతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులలో ఆమె కీలక పాత్రలు పోషించారు.

మరోవైపు సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్స్ మరియు వ్యక్తిగత విమర్శలపై కూడా అనసూయ ఈ సందర్భంగా ఘాటుగా స్పందించారు. తానూ అప్పుడప్పుడు పరిమితంగా చేస్తానని డ్రింక్, అయితే దానిని కొందరు వివాదంగా మార్చి నెట్టింట విపరీతంగా ట్రోల్ చేసారు. ప్రస్తుతం తాను ఇలాంటి నెగెటివిటీని అస్సలు పట్టించుకోవడం లేదని, ఎవరు ఎన్ని మాట్లాడినా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు.

అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమెకు మద్దతుగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. పరిశ్రమలో ఇలాంటి వివక్ష సాధారణమేనని, వాట పోటీ తట్టుకుని ఈరోజు ఈ స్థాయికి రావడం గర్వకారణమంటూ నెటిజన్లు ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సూయ.. రాబోయే రోజుల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నటనకు ప్రాధాన్యమున్న లేడీ ఓరియెంటెడ్ కథలతో పాటు పెద్ద సినిమాల్లోనూ నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird