Home సినిమా సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసిన బ్యాడ్ బాయ్ కార్తీక్.. ఎందులో ఉందంటే – Andhra Waves

సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసిన బ్యాడ్ బాయ్ కార్తీక్.. ఎందులో ఉందంటే – Andhra Waves

by
0 comments
సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసిన బ్యాడ్ బాయ్ కార్తీక్.. ఎందులో ఉందంటే


నాగశౌర్య సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై సందడి చేసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. ‘రంగబలి’ చిత్రం తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని నాగశౌర్య చేసిన ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఆయన అభిమానులు, టాలీవుడ్ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. రమేష్ దేశినా దర్శకత్వంలో సరికొత్త కథాంశంతో, విభిన్నమైన కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. సినిమా మేకింగ్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువలతో వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు.

అయితే ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా గత నెల ఏప్రిల్ 17న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. కానీ దురదృష్టవశాత్తూ థియేట్రికల్ రన్ సమయంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ల విషయంలో ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేకపోయింది. సరైన ప్రమోషన్లు మరియు ప్రీ-రిలీజ్ బజ్ లేకపోవడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. చాలా మంది సాధారణ సినీ ప్రియులకు అసలు ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చిన సంగతి కూడా తెలియకుండా పోయింది. అలా బాక్సాఫీస్ రేసులో వెనుకబడిపోయిన ఈ యాక్షన్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు చాలా సైలెంట్‌గా సరికొత్త రూపంలో ఓటీటీ వేదికపైకి వచ్చేసింది.

ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేదా ఆర్భాటాలు లేకుండా ప్రముఖ డిజిటల్ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిన్న అర్ధరాత్రి నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో దూకుడు స్వభావం మరియు తిరుగుబాటు గుణం ఉన్న ఒక సామాన్య యువకుడిగా నాగశౌర్య సరికొత్త మాస్ అవతారంలో కనిపించి మెప్పించారు. తన ముద్దుల అక్క కస్తూరి పాత్రలో నటించిన ‘ఈశ్వర్’ ఫేమ్ శ్రీదేవి విజయ్‌కుమార్ కోసం, ఆమె సురక్షితమైన భవిష్యత్తు కోసం ఒక తమ్ముడు సమాజంలోని అరాచక శక్తులపై, స్థానిక క్రిమినల్స్ పై చేసిన పోరాటమే ప్రధాన కథాంశం. ఈ అండర్ కరెంట్ సిస్టర్ సెంటిమెంట్ ఎపిసోడ్స్ డిజిటల్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి: త్రిష: త్రిష అలక.. అసలు రహస్యం బయటపెట్టిన ఎంఎస్ రాజు

హీరోయిన్‌గా నటించిన విధి యాదవ్ గ్లామర్, విలక్షణ నటుడు సముద్రఖనిఫుల్ విలనిజం, మరియు సాయికుమార్, నరేష్, వెన్నెల కిశోర్ వంటి సీనియర్ నటీనటుల అద్భుతమైన ప్రదర్శన ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. హారిస్ జయరాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీక్వెన్స్‌లకి మంచి హైప్ ఇచ్చింది. మరి ఓటిలో ఈ మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird