ఇంధన పొదుపు దిశగా ముఖ్యమంత్రి అడుగులు..
ప్రధాని మోదీ పిలుపుతో కీలక నిర్ణయం..
ఏపీలో సరికొత్త ‘పొదుపు’ మంత్రం..
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు సీఎం చంద్రబాబు తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. జిల్లా పర్యటనల్లో వాహనాల సంఖ్య 50% తగ్గించాలని డీజీపీని అదనంగా. మంత్రులు, వీఐపీలు కూడా చాలా తక్కువ వాహనాలు వాడేలా చూడాలని సూచించారు.
రాష్ట్రంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వ్యయాన్ని తగ్గించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా తన సొంత కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను భారీగా తగ్గించాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండానే, అనవసరమైన వాహనాల రాకపోకలను నియంత్రించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పనితీరులో పొదుపు సంస్కృతిని తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంధన వినియోగం తగ్గించడం వల్ల కేవలం ఆర్థిక భారమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆ నిధులను ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లించవచ్చని ముఖ్యమంత్రి.
ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో మరియు సామాన్య ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో భారీ కాన్వాయ్లతో సామాన్యులకు కలిగే ఇబ్బందులు కూడా దీనివల్ల తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాలకులే స్వయంగా పొదుపు పాటిస్తే, అది ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందని పలువురు ప్రశంసిస్తున్నారు.
రేపు జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఇంధన పొదుపుతో పాటు పరిపాలనా వ్యయాల తగ్గింపుపై మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ పొదుపు, డిజిటల్ పరిపాలన పెంపు వంటి వాటిని కూడా సీఎం దృష్టి సారించినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఏపీ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలతో ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
