తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం థియేటర్ల యజమానులకు (ఎగ్జిబిటర్లు) మరియు నిర్మాతలు/డిస్ట్రిబ్యూటర్లకు మధ్య వివాదం ముదురుతోంది. ముఖ్యంగా ‘రెంట్ వర్సెస్ పర్సంటేజ్’ పద్ధతిపై జరుగుతున్న చర్చపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తనదైన శైలిలో స్పందించారు. రామ్ చరణ్ నటించబోయే ‘పెద్ది’ సినిమా థియేటర్లలో ఇష్యూపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
టాలీవుడ్లో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘జెట్లీ’ సినిమా విషయంలో కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. నైజాం ప్రాంతంలో థియేటర్ల అద్దె విషయంలో ఎగ్జిబిటర్లు పట్టుబడుతుంటే, నిర్మాతలు మాత్రం పర్సంటేజ్ పద్ధతిని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి చిత్రం ‘పెద్ది’కి కూడా థియేటర్ల సమస్య ఎదురవుతుందా అనే దానిపై నట్టి కుమార్ స్పష్టతనిచ్చారు.
నట్టి కుమార్ మాట్లాడుతూ, “సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కంటెంట్ ఉన్నవాడే ఓనర్. చిన్న సినిమాలకు నిర్మాతలు థియేటర్ల దగ్గరకు వెళ్లాలి, కానీ పెద్ద సినిమాలకు ఎగ్జిబిటర్లే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరకు వస్తారు” అని పేర్కొన్నారు. పెద్ద సినిమాల విషయంలో ఎగ్జిబిటర్లు డిక్టేట్ చేయడం కుదరదని, సినిమా వద్దా అనేది నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ ఇష్టమని ఆయన స్పష్టం చేశారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు తమను మల్టీప్లెక్స్లతో పోల్చుకోవడం సరికాదని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. మల్టీప్లెక్స్లలో నిర్వహణ ఖర్చు, టికెట్ ధరలు మరియు ఆక్యుపెన్సీ వేరుగా ఉంటాయని, అక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులు షో వేస్తారని, కానీ సింగిల్ స్క్రీన్లో 30 టికెట్లు తెగనిదే షో వేయని పరిస్థితి ఉందని గుర్తు చేశారు.
నిర్మాతలు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే, అది ఫ్లాప్ అయితే నిర్మాత రోడ్డున పడతాడే తప్ప ఎగ్జిబిటర్లు వచ్చి ఆదుకోరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “మొన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి సినిమాల విషయంలో కోట్లలో నష్టం వచ్చినప్పుడు ఏ ఎగ్జిబిటర్ అయినా డొనేషన్ ఇచ్చారా?” అని ప్రశ్నించారు. నిర్మాత విలువను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
చిన్న సినిమాను ఆదరించని థియేటర్లకు పెద్ద సినిమాలు ఇవ్వకూడదని, ఆ ధైర్యం నిర్మాతలు చూపించాలని నట్టి కుమార్ సూచించారు. అప్పుడే పరిశ్రమలో జరిగేటట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆసక్తికరమైన ఇంటర్యూల కోసం మా తెలుగు సినిమాను సబ్స్క్రయిబ్ చేసుకోండి.