ఐపీఎల్ 2026 సీజన్లో బెంగళూరు వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ సత్తా చాటింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి, ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ చివరి ప్రేక్షకులకు క్రీడా వినోదాన్ని పంచింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (63) మెరుపు ఇన్నింగ్స్తో ఆర్సీబీ జట్టు ఒక దశలో భారీ స్కోరు దిశగా సాగింది. 9 ఓవర్లకు 90/1తో పటిష్ట స్థితిలో ఉన్న ఆర్సీబీ, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది.
లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచే స్థిరంగా ఆడింది. కేఎల్ రాహుల్ (57) బాధ్యతాయుతమైన లీనింగ్ జట్టుకు పునాది వేయగా, ట్రిటన్ స్టబ్స్ (60*) క్రీజులో నిలబడిన జట్టును విజయతీరాలకు చేర్చారు. మధ్యలో అక్షర్ పటేల్ (26) సహకారం అందించారు, చివర్లో డేవిడ్ మిల్లర్ (22*) దూకుడుగా ఆడి విజయాన్ని ఖాయం చేశారు.
ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో రాణించాడు, ఇతర బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఢిల్లీ బ్యాటర్ల జోరు ముందు ఆర్సీబీ బౌలింగ్ తేలిపోయింది. ఢిల్లీ బౌలర్లలో ఎంగిడి, అక్షర్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోవడం ఆ జట్టు అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. గత మ్యాచ్లతో కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం వల్లనే ఈ ఓటమి ఎదురైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు ఆ జట్టు పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకోవడానికి దోహదపడింది.
ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్లో ఉత్సాహం. టోర్నీ ముందు సాగుతున్న కొద్దీ జట్ల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. రాబోయే మ్యాచ్లలో గెలుపు కోసం ఆర్సీబీ తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. టోర్నమెంట్లో నిలవాలంటే మిగిలిన మ్యాచ్లలో ఆర్సీబీ బ్యాటర్లు మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుంది.
