ఎండల తీవ్రతతో ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీలో అత్యధికంగా పిడుగురాళ్లలో 48.1, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ముత్తారం. సూర్యాపేట జిల్లా మునగాలతో 46.5 డ్రైగ్రిల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోని కృష్ణాజిల్లా నందివాడ, బాపట్ల జిల్లా వేటపాలెంలో 47.4 ఉష్ణోగ్రత నమైదైంది. రాష్ట్రంలోని 418 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఏపీలోని 20 జిల్లాల్లోని 200 మండలాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో 46.4, మహబూబాబాద్ జిల్లా కురవిలో 46.3 డిగ్రీలు నమోదయ్యాయి. తెలంగాణలోని 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. గురువారం హైదరాబాద్లో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, అధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ముఖ్యంగా 24 మధ్య వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉదయం 10 గంటల నుంచే భానుడి భగభగలు, వడగాల్పుల తీవ్రత ప్రారంభమవుతుండగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు
.webp)