బండి భగీరథ చుట్టూ తిరుగుతున్న పోక్సో వ్యవహారం గత కొన్ని రోజులుగా తీవ్ర సంచలనం, రాజకీయ మలుపులు తిరుగుతోంది. ఈ ఎపిసోడ్లో ఇప్పటివరకు జరిగిన అత్యంత కీలకమైన పరిణామాలు కాలక్రమేణా చూస్తే..
మే 8న ఒక 17 ఏళ్ల మైనర్ బాలికను వేధించారనే ఆరోపణలతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని పెట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మొదటి కేసు నమోదైంది. ప్రారంభంలో భారతీయ న్యాయ సంహిత కింద మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12 కింద కేసు పెట్టారు.
డీసీపీ రితిరాజ్ ప్రత్యేక బృందం బాధితురాలి నుంచి అదనపు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత, ఈ కేసులో మరింత తీవ్రమైన, నాన్-బెయిలబుల్ సెక్షన్లయిన పోక్సో సెక్షన్ 5(ఎల్) రెడ్ విట్ 6 ను యాడ్ చేశారు. ఈ పోక్సో కేసు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే, భగీరథ్ కోసం కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కౌంటర్ ఫిర్యాదు నమోదైంది.
సదరు బాలిక కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తూ, రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ వళ్లకు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును పోక్సో కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి బాధితురాలి కుటుంబం ఆరోపించింది.
అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోరడంతో పాటు కేసును కొట్టివేయాలని కోరుతూ భగీరథ్ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ను ఆశ్రయించారు. గతంలో బాలికపై నమోదైన ఒక పాత స్పీడింగ్ కేసు రికార్డులను చూపిస్తూ.. ప్రస్తుతం ఆమె మైనర్ కాదని, ఆమె వయస్సు 19 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుందని, కాబట్టి పోక్సో చట్టం వర్తించదని భగీరథ తరఫు న్యాయవాది వాదించారు.
అయితే, తీవ్రమైన సెక్షన్లు ఉన్నందున హైకోర్టు తక్షణ ముందస్తు బెయిల్ లేదా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడానికి నిరాకరిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టులో పిటిషన్ నడుస్తున్న సమయంలో భగీరథ్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం, ఆయన అక్కడ లేకపోవడంతో సైబరాబాద్ పోలీసులు ఆయనను పరారీలో గుర్తించారు.
ఆయనను పట్టుకోవడానికి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడమే కాకుండా, దేశం దాటి వెళ్లకుండా విమానాశ్రయాలకు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. శనివారం, మే 16 నాటి రాత్రి నాటకీయ పరిణామాల మధ్య భగీరథ్ను అరెస్ట్ చేశారు.పెట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సుమారు రెండు గంటల పాటు విచారించి, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం పోలీసులు ప్రయత్నించారు.
ఆ తర్వాత, మేడ్చల్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీనితో ఆయనను చర్లపల్లి జైలుకు. ప్రస్తుతానికి ఈ కేసు దర్యాప్తు ప్రత్యేక బృందం- తుది దశకు చేరుకునేలా, కోర్టు రిమాండ్ విధించడంతో ఈ ఎపిసోడ్ చట్టపరంగా అత్యంత కీలకమైన మలుపు తిరిగింది.
