భారతదేశంలో గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న మత ప్రచారాలు, వాటి పరిణామాలు కేవలం విశ్వాసాలకు సంబంధించిన అంశాలుగా మిగలకుండా తీవ్ర రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. వివిధ ప్రాంతాలలో చోటుచేసుకుంటున్న మత మార్పిడులు స్థానిక జీవన విధానాన్ని మార్చడమే కాకుండా, సామాజిక నిర్మాణాన్ని, సాంస్కృతిక గుర్తింపును ప్రభావితం చేస్తున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మతపరమైన మార్పులను సమాజంలో కొత్త ఏర్పాటుకు కారణమవుతూ, దేశ అంతర్గత భద్రత, ఐక్యతపై దీర్ఘకాలికంగా సంపూర్ణంగా చూపే దిశగా పరిణమిస్తున్న విశ్లేషకులు అంటున్నారు.
ఈ పరిణామాలు కేవలం ఆధ్యాత్మిక నిర్ణయాలు కావనీ, వీటి వెనుక వ్యూహాత్మక రాజకీయాలు ఉన్నాయనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాగుతోంది. ముఖ్యంగా, మతపరమైన మార్పు వల్ల స్థానిక సమాజాలలో సాంస్కృతిక పరాయీకరణ స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. తరతరాలుగా వస్తున్న పూర్వీకుల ఆచారాలు, గ్రామ దేవతల ఆరాధన, ప్రాంతీయ పండుగలు, సంస్కృతులను విస్మరించేలా కొత్త సిద్ధాంతాలు ప్రేరేపిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.
ఉదాహరణకు, ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్లో దాదాపు 98 శాతం జనాభా క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత.. అక్కడి ప్రాచీన యానిమిస్ట్ సంప్రదాయాలు, తెగల పండుగలు మూఢనమ్మకాలుగా లేదా అనవసరమైనవిగా మారిపోయాయి. వాటి స్థానంలో పాశ్చాత్య జీవన విధానం, చర్చి ఆధారిత సంస్కృతి ప్రాధాన్యతలను సంతరించుకున్నాయి. అలాగే, మిజోరంలో కూడా 1950ల నాటి సాంప్రదాయ సామాజిక ఉద్యమాల అనంతరం స్థానిక యువజన వ్యవస్థలు, వెదురు నృత్యాల వంటి సంస్కృతులు క్రమంగా ప్రాధాన్యతను కోల్పోయాయి.. చర్చి ప్రభావం సమాజంలో ప్రముఖ పాత్ర పోషించడం ప్రారంభించింది. ఈ సాంస్కృతిక మార్పులతో పాటు, సమాంతర అధికార వ్యవస్థలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. విద్యా సంస్థలు, వైద్యశాలలు, స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు), విస్తారమైన భూసంపదను నియంత్రిస్తూ కొన్ని మతపరమైన సంస్థలు ఒక బలమైన సామాజిక శక్తిగా ముందుకు సాగుతున్నాయి.
దీనివల్ల సాధారణ ప్రజల విధేయత స్థానిక గ్రామ సభల నుండి మతపరమైన డీసెస్ లేదా పారిష్ వ్యవస్థల వైపు మళ్లుతోంది. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకుడి వంటి తీర ప్రాంత మత్స్యకార గ్రామాలలో ఇటువంటి సామాజిక మార్పుల కారణంగా హిందూ, క్రైస్తవ వర్గాల మధ్య తరచుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. భూమి, స్థానిక వనరులు, పండుగల నిర్వహణ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదాలు పెరగడానికి ఈ సమాంతర అధికార వ్యవస్థలే కారణమని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మరో వైపు, మతమార్పిడుల ప్రభావం రాజకీయ వాదానికి కూడా దారితీస్తోందని ఈశాన్య రాష్ట్రాల పరిణామాలు రుజువు చేస్తున్నాయి. నాగాలాండ్లో 1946 కాలంలో ఏర్పడిన నాగా నేషనల్ కౌన్సిల్ (ఎన్ఎన్సీ) ఉద్యమానికి బాప్టిస్ట్ చర్చి నైతిక, సామాజిక మద్దతు అందించింది. అక్కడ రాజకీయ లక్ష్యాలను మతపరమైన నినాదాలతో ముడిపెట్టడం జరిగింది.
మిజోరంలో కూడా లాల్డెంగా ఏర్పాటు జరిగిన మిజో నేషనల్ ఫ్రంట్ తిరుగుబాటు సమయంలో చర్చి భవనాలు రహస్య స్థావరాలుగా, సమాచార మార్పిడి కేంద్రాలుగా ఉపయోగపడ్డాయి. ప్రస్తుత రోజుల్లో మణిపూర్ ప్రాంతంలో కూడా కుకీ-జో క్రైస్తవ మెజారిటీ ప్రాంతాలు మైతే వర్గాల నుండి వేరుపడి ప్రత్యేక పాలనను డిమాండ్ చేయడం.. దానికి కొన్ని చర్చి సంస్థలు బహిరంగంగా మద్దతు తెలపడం. సాంస్కృతిక మార్పు సమాజ విభజనకు, అది కాస్తా రాజకీయ డిమాండ్లకు దారితీసే క్రమాన్ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులోని తీరప్రాంతాలలో సరికొత్త రాజకీయ సమీకరణలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవాంజెలికల్, పెంటకోస్టల్ సమూహాల విస్తరణ ద్వారా విదేశీ దాతలతో నేరుగా సంబంధాలు కలిగిన ఓటు బ్యాంకులు తయారవుతున్నాయి.
గతంలో జరిగిన కుడంకుళం అణు విద్యుత్ కేంద్ర వ్యతిరేక నిరసనల చర్చి నెట్వర్క్ల సమన్వయం, యూరోపియన్ ఎన్జీఓల నుండి వచ్చిన నిధుల ప్రవాహం ద్వారా అధికారిక దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ తీరప్రాంతాల్లో కొన్నిచోట్ల జాతీయ పండుగల సందర్భంగా జాతీయ జెండాకు బదులుగా మతపరమైన జెండాలను ఎగురవేయడం వంటి సంఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ రంగంలో తీవ్ర మత మార్పిడి నేపథ్యం ఉన్న నేతలు అధికార పీఠాలను అధిరోహించడం, స్థానిక సంస్కృతులకు ప్రమాదకరంగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రకమైన అంతర్గత మార్పులు అంతర్జాతీయ నెట్వర్క్లతో ముడిపడి ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ దౌత్యం, విదేశీ నిధులు కలిసి ఒక ప్రాంత భౌగోళిక రాజకీయాలను ఎలా మార్చగలవో చెప్పడానికి తూర్పు తైమూర్ ఉదాహరణను చూపారు.
గతంలో ఇండోనేషియా ఆధీనంలో ఉన్న తూర్పు తైమూర్, అక్కడి మెజారిటీ కథ జనాభా, వాటికన్, యూరోపియన్ ప్రభుత్వాల దౌత్య మద్దతుతో 1999లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ప్రత్యేక క్రైస్తవ దేశ అవతరించింది. భారతదేశంలో కూడా మత మార్పిడి కార్యకలాపాలను అడ్డుకున్న ప్రతిసారీ.. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, యూరోపియన్ పార్లమెంట్, యూఎస్సీఐఆర్ఎఫ్ వంటి అంతర్జాతీయ వేదికలు భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నివేదికలు ఇవ్వడం వెనుక ఇటువంటి వ్యూహాల దాగి ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్త మిషనరీ నెట్వర్క్లు, గ్లోబల్ డేటాబేస్లైన జాషువా ప్రాజెక్ట్, ఆపరేషన్ వరల్డ్ భారతదేశంలోని జిల్లాలను కులం, భాష, పిన్ కోడ్ ఆధారంగా వర్గీకరించి, లక్షిత ప్రాంతాలలో మత ప్రచారాలను చేస్తున్నారు. మతం మారిన స్థానికులు ఈ అంతర్జాతీయ వ్యవస్థలలో స్నేహితులుగా మారుతున్నారు. జనాభా లెక్కల సేకరణ లేదా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన చర్చలు జరిగినప్పుడు, ఈ దేశంలోశాన్య రాష్ట్రాల చర్చి కూటములు ఏకకాలంలో ఒకే విధమైన వ్యతిరేక ప్రకటనలు విడుదల చేయడం ఈ అంతర్జాతీయ ప్రచారాల సమన్వయానికి నిదర్శనంగా ఉంది. మొత్తంగా భారతదేశంలో మతపరమైన విస్తరణ, రాజకీయాల కలయిక దేశ సాంస్కృతిక, భౌగోళిక భవిష్యత్తుపై అనేక కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది కేవలం వ్యక్తిగత నమ్మకాలకు సంబంధించిన అంశం కాదనీ, సమాజ పునర్నిర్మాణం, రాజకీయ ప్రయోజనాల కోసం సాగుతున్న వ్యూహాత్మక చర్య అని స్పష్టమవుతోంది. దేశ సార్వభౌమాధికారం, సాంస్కృతిక గుర్తింపు, దీర్ఘకాలిక భద్రతను కాపాడుకోవడానికి భారత సమాజం, పాలకులు ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనే దానిపై దేశ భవిష్యత్తు ఉంటుందని మేధావులు అంటున్నారు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చితే, దయచేసి https://www.teluguone.com పోర్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. భాగస్వామ్యం చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.
