విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో భారత విమానయాన సంస్థల నిర్వహణ భారంతో చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ సాయం కోసం ఉన్నాయి. కేంద్రం ఆదుకుంటే కంపెనీ పట్టామో, ఆపరేషన్లు నిలిపివేయడమో మినహా మరో మార్గం లేదు అంట. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ వంటి ప్రధాన విమానయాన సంస్థలకు నిర్వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ (ఎఫ్ఐఏఏ) ఈ మేరకు సివిల్ ఏవియేషన్ కార్యదర్శికి తాజాగా లేఖ రాసింది.
ఎయిర్లైన్స్ ఆపరేషన్లు కొనసాగించాలంటే కేంద్రం తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని కోరింది.
అసాధారణ రీతిలో పెరుగుతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలతో దేశీయ, ఎయిర్లైన్స్ కార్యకలాపాలు అసాధ్యంగా, అస్థిరంగా మారుతున్నాయని ఎఫ్ఐఏ ఆందోళన వ్యక్తం చేసింది. భారత తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లకు గురువుతున్నాయని చెప్పారు. రెండు నెలలుగా ఇరాన్ యుద్ధం కొనసాగుతుండటంతో క్రూడాయిల్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనితో ఏటీఎఫ్తో సహా పెట్రోలియం పెరుగుతున్న ఉత్పత్తుల ధరలు విపరీతంగా ఉన్నాయి.
విమానాల విడిభాగాలు, లీజు చెల్లింపులు ఖరీదైనవిగా మారుతున్నాయి. టిక్కెట్ ధరలపై తీవ్రమైన పోటీ కారణంగా లాభాలు కూడా తగ్గుతున్నాయని విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇంధనం ధరల్లో పెరుగుదల ఎయిర్లైన్ నెట్వర్క్ను దెబ్బతీసింది, నిర్వహణ తలకుమించిన భారమవుతోందని చెబుతున్నారు. ‘ఎయిర్లైన్ ఆపరేషన్లు కొనసాగాలన్నా, సంస్థ మనుగడ సాగించాలన్నా, ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కాలన్నా ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి. అర్ధవంతమైన ఆర్థిక సాయం ప్రకటించాలి’ అని సివిల్ ఏవియేషన్ సెక్రటరీకి రాసిన లేఖలో ఎఫ్ఐఏ కోరింది.
.webp)