వికారాబాద్ జిల్లాలో డ్రోన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రమాదం జరిగింది. కుల్కచర్ల మండల వ్యవసాయ మందులు పిచికారి చేసే డ్రోన్ను ప్రారంభించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. టి రామ్ మోహన్ రెడ్డి ఉన్నారు. కార్యక్రమం ప్రారంభించి డ్రోన్ను ఎగరవేసిన కొద్దిసేపటికే అది నియంత్రణ తప్పి నేరుగా ఎమ్మెల్యే వైపు దూసుకెళ్లింది. డ్రోన్ రెక్కలు తగలడంతో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి.
ఘటన సమయంలో సమీపంలో ఉన్న పలువురికీ గాయాలు కావడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే అప్రమత్తమైన అనుచరులు ఎమ్మెల్యేను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి చూస్తున్నారు. ఈ ఘటనతో హాజరైన వారు ఆందోళన వ్యక్తం చేశారు. డ్రోన్ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
