
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
సదరం సర్టిఫికెట్ కు అర్హులైన వారందరికీ జిల్లా అయ్యేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో సదరం క్యాంపుల నిర్వహణ, యుడిఐడి పోర్ట్ లో అప్లోడ్ పై డిపిఎం, ఏపీఎంలతో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సదరం సర్టిఫికెట్ కోసం చేసుకున్న దరఖాస్తులన్నీ యూడీఐడీ పోర్టులో అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. సదరం క్యాంపుకు ఎక్కువ మొత్తంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ తక్కువ మంది క్యాంపులకు హాజరవుతున్న పబ్లిక్ కలెక్టర్ పేర్కొన్నారు. ఆధార్ సర్టిఫికెట్ కొరకు స్లాట్ బుక్ చేసిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా తప్పనిసరిగా ఇచ్చి పంపేందుకు హాజరు అయ్యేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన సూచించారు. డిఆర్డిఏ ద్వారా చేపట్టే వివిధ కార్యక్రమాల గురించి ఆయన ఆరా తీశారు. సమీక్ష సమావేశంలో డిఆర్డిఏ శ్రీనివాస్, డిప్యూటీ డిఆర్డిఏ నర్సింలు, డిపిఎం మహేష్, ఏపీఎంలు.