పోస్ట్ చేయబడింది జనవరి 24, 2026 2:38PM

పెళ్లంటే లక్షలు ఖర్చు చేసి, భారీ వేడుకలతో జరుపుకునే రోజులివి. కానీ అందుకు భిన్నంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు ఆదర్శప్రాయమైన వివాహం చేసుకున్నారు.
చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఎలాంటి ఆడంబరం లేకుండా, రిజిస్టర్ మ్యారేజ్ చేసి అందరికీ సందేశం ఇచ్చారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన యువ ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం సరళ కుత్బుల్లాపూర్ డీసీపీగా బాధ్యతలు శేషాద్రిని రెడ్డి, ఐఏఎస్ ట్రైనింగ్లో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఈ వివాహంతో సమాజానికి మంచి ఉదాహరణగా నిలిచారు. ఈ వివాహానికి పలువురు, కుటుంబ సభ్యులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
