జనవరి 19, 2026 10:14AMన పోస్ట్ చేయబడింది

ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డికి ఎన్ ఫోర్స్ వైసీపీ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులను విచారించిన ఈడీ, రెండు రోజుల కింద వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా వైసీపీకి చెందిన మరో ఎంపీకి నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మిధున్ రెడ్డిని ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే ఇదే కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తోంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో భారీ ఎత్తున జరిగిన నగదు చలామణిలో మిథున్ రెడ్డి పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును వివిధ మార్గాల్లో మనీ ల్యాండరింగ్ చేశారనీ, ఆ సొమ్ము కీలక వ్యక్తుల వరకూ చేరిందని ఈడీ అనుమానిస్తోంది.
జగన్ హయాంలో అమలు చేసిన మద్యం విధానంలో లైసెన్సుల కేటాయింపు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మిథు రెడ్డి పాత్రపై స్పష్టత కోసం ఆయనను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ స్కామ్కు సంబంధించి అధికారులు, వ్యాపారులు, మధ్యాహ్నాలను విచారించిన ఈడీ, తాజాగా ఎంపీ స్థాయి నేతలకు నోటీసులు ఇవ్వడంతో కేసు దర్యాప్తు తుదిదశకు చేరుకుందని భావిస్తున్న పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిథున్ రెడ్డి విచారణలో కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మనీ ట్రయిల్పై ఈడి ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఇక ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మిథున్ రెడ్డి ఈడి విచారణకు ఎలా నమోదైంది, విచార ణలో ఏమి బయటపడుతుందోనని, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
