Home Latest News సీసీ కెమెరాల పేరుతో కడప రెడ్డమ్మ వసూళ్లు? | రెడ్డెప్పగారి మాధవి రెడ్డి| కడప ఎమ్మెల్యే| శ్రీనివాసులు రెడ్డి| సీసీ కెమెరాలు| అమ్జద్ బాషా| టీడీపీ| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| YSRCP – Andhra Waves

సీసీ కెమెరాల పేరుతో కడప రెడ్డమ్మ వసూళ్లు? | రెడ్డెప్పగారి మాధవి రెడ్డి| కడప ఎమ్మెల్యే| శ్రీనివాసులు రెడ్డి| సీసీ కెమెరాలు| అమ్జద్ బాషా| టీడీపీ| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| YSRCP – Andhra Waves

by andhra andhrawave
0 comments
సీసీ కెమెరాల పేరుతో కడప రెడ్డమ్మ వసూళ్లు? | రెడ్డెప్పగారి మాధవి రెడ్డి| కడప ఎమ్మెల్యే| శ్రీనివాసులు రెడ్డి| సీసీ కెమెరాలు| అమ్జద్ బాషా| టీడీపీ| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| YSRCP


పోస్ట్ చేయబడింది జనవరి 7, 2026 5:25PM


రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.. కడప ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు.. పార్టీ ఏదైనా సరే తనపై వచ్చే విమర్శలకు అంతే ధీటుగా నిలిచారు. దశాబ్ద కాలంగా కడప కార్పొరేషన్ మేయర్‌గా ఉన్న సురేష్ బాబు చెక్ పెట్టి పదవి నుంచి దించేశారు. తన వ్యవహార శైలితో సొంత పార్టీ నేతలను దూరం పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇదంతా ఓ లెక్కైతే ఇప్పుడు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆమె భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి కడపలో సీపీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం జిల్లాలో దూమారం రేపుతోందట.. 2024 ఎన్నికల ముందు నగరంలో నేరాలు అరికడతామని, గంజాయి స్మగ్లర్లకు చెక్ పెడతామని హామీ ఇచ్చారు కడప రెడ్డమ్మ. ఇప్పుడు దంపతులు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు నరగంలో సీసీ కెమెరాలు అవసరమని దాతల సహకారంతో పి4 పద్దతిలో నిధుల సమీకరణకు ఎమ్మెల్యే చేపట్టారంట.

నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సొంత పార్టీకి చెందిన మైనారిటీ నేత రబ్బాని రూ.10 లక్షలు అందించిన ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి. ఇవ్వకపోతే పార్టీకి మీతో సంబంధాలు కట్ చేస్తాం మీ కథ చూస్తాం అని హెచ్చరించడం ఇప్పుడు జిల్లాలో దూమారం రేపుతోంది. సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు సీసీ కెమెరాల పేరుతో వసూళ్లు వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో మైనారిటీ నేత రబ్బాని తండ్రి జిలానీ అస్వస్ధతకు గురికావడం చర్చినీయాంశంగా మారింది. జిలానిని శ్రీనివాసులు బెదిరించడం వల్లే అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొందేందుకు ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.

కడప నగరంలో సీసీ కెమెరాల వివాదం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే చిల్లర రాజకీయం మండిపడుతున్నారు మాజీ డిఫ్యూటీ సియం అంజాద్ బాషా. అయితే ఎమ్మెల్యే అయితే ఎవరు ఏం అనుకున్నా ఎన్ని ట్రోల్స్ చేసినా తగ్గేదిలే అంటున్నారు. కడప నగరం గంజాయికి అడ్డాగా మారిందని, గంజాయి ఫెడ్లర్లకు చెక్ పెట్టాలంటే ప్రతి గల్లీలో సిసి కెమెరాలు అవసరమని అంటున్నారు.

సీసీ కెమెరాల కోసం కోటి రూపాయలకి పైగా నిధులు అవసరం అని అందుకే పి4 మోడల్‌లో నిధులు సమర్ధిస్తున్నామని ఆమె తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు దాతలు ముందుకు రావాలని సీసీ కెమెరాలు అందించే కంపెనీ పేరుతో చెక్ అందించాలని కోరుతున్నారు . అయితే మీ పార్టీ అధికారంలో ఉంది… ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి కెమెరాలు ఏర్పాటు చేయాలి కానీ ఇలా బెదిరించి వసూలు చేయడం ఏంటని వైసీపీ విమర్శకులు చేస్తున్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird