డిసెంబర్ 13, 2025 6:06PMన పోస్ట్ చేయబడింది

గ్లోబల్ సాగర్ లెజెండ్ లియోనెల్ మెస్సీ శంషాబాద్ ఎయిర్ఫోర్టు నుంచి ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకున్నారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు. కేవలం 250 మందికి మాత్రమే మోస్సీని కలిసే అవకాశం కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను కేటాయించారు. అనంతరం మెస్సీ బృందం ఉప్పల్ స్టేడియానికి చేరుకుంది. మెస్సి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోల్కతాలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఫలక్నుమా ప్యా, ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తు చేశారు.
