ఉత్తరాఖండ్లో ఎంతో పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రకు భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తారు. ఈ పర్వత భాగాలను వాహనాలతో పూర్తిగా స్తంభించిపోయాయి. వీకెండ్ (వారంతపు సెలవులు) కావడం, తోడు యాత్రికుల రద్దీ ఒక్కసారిగా ఊహించని విధంగా పెరగడంతో హిమాలయ మార్గాలన్నీ భారీ ట్రాఫిక్ జామ్తో నిండిపోయాయి. ముఖ్యంగా చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ క్షేత్రానికి వెళుతున్న వేలాది మంది భక్తులు ఈ సుదీర్ఘ ట్రాఫిక్జామ్ కారణంగా కొండల నడుమ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కేదార్నాథ్, జోషిమఠ్, గోవింద్ ఘాట్ల సమీపంలోని బద్రీనాథ్ ప్రధాన కంపెనీతో పాటు, కేదార్నాథ్కు దారితీసే అత్యంత కీలకమైన సోన్ ప్రయాగ్ వంటి మార్గాల్లో రద్దీ తీవ్రరూపం దాల్చింది. ఈ మార్గాల్లో వాహనాలు అంగుళం కూడా కదలని పరిస్థితి. ఈ ట్రాఫిక్ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే, కేవలం జోషిమఠ్ నుండి బద్రీనాథ్ వరకు దాదాపు 25 నుండి 30 కిపైగా మేర వాహనాలు ఒక వెనుక ఒకటి చొప్పున బారులు తీరిపోయాయి.
దీంతో పవిత్ర దర్శనం కోసం ఎన్నో ఆశలతో వచ్చిన వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు సైతం గంటల తరబడి వాహనాల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. కొండ ప్రాంతాలకు ప్రస్తుతం పక్కన ఆహార సదుపాయాలు లేక, కనీసం సరైన తాగడానికి మంచినీళ్లు కూడా దొరకక యాత్రికులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు.
పరిస్థితి రోజురోజుకూ జటిలంగా మారుత స్థానిక అధికారుల రంగంలోకి దిగింది. ఈ భారీ గందరగోళాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఉత్తరాఖండ్ పోలీస్ అధికారులు, స్థానిక సిబ్బంది కలిసి ఉమ్మడిగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. కొండ మలుపుల వద్ద వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ట్రాఫిక్ క్లియర్ కోసం ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో యాత్రకు బయలుదేరే భక్తులకు అధికారులు ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. చార్ధామ్ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు యాత్రికులు ఖచ్చితంగా స్థానిక వాతావరణ పరిస్థితులను, ప్రస్తుత రోడ్డు ట్రాఫిక్ వివరాలను ముందుగానే తెలుసుకోవాలని సూచించారు. ఆ సమాచారానికి అనుగుణంగానే తమ ప్రయాణ ప్రణాళికను (ప్లాన్) మార్చుకోవడం సురక్షితమని స్పష్టం చేశారు.
మరోవైపు, దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు మార్గమధ్యంలో ఎలాంటి ఊహించని వాటిని కలగకుండా శాశ్వత ఏర్పాట్లు చేయాలని యాత్రికులు డిమాండ్ చేస్తున్నారు. యాత్రా మార్గం పొడవునా ట్రాఫిక్ నిర్వహణను మరింత పటిష్టం చేయవలసి ఉంది, అత్యవసర వైద్య, ఆహార సౌకర్యాలను రోడ్ల పక్కన ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
