శంషాబాద్ నోవాటెల్ హోటల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తాజా రాజకీయాలపై చర్చించారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో పార్టీ, ఎస్ఐఆర్ సహా పలు కీలక పరిస్థితి చర్చిస్తున్నట్లు. ఎస్ఐఆర్ ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాల ప్రణాళిక, బడ్జెట్ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఖర్గేకు వివరించారు. ఈ వారంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో కూడా ఈ అంశంపై చర్చించారు.. జూన్ రెండోవారంలో మంత్రి వర్గ విస్తరణ చేపడుతారని తెలిపారు. ఈ భేటీ తర్వాత మల్లికార్జున ఖర్గే గుల్బర్గాకు వెళ్లేందుకు జరిగిన సమాచారం.
.webp)