
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి పట్టణంలో సమ్మర్ క్యాంపు క్రీడాకారులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, నల్లగొండ జిల్లా కార్యదర్శి అమీన్ బాబా సహకారంతో క్రికెట్ కిట్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ తాంగేళ్ళపల్లి శ్రీవాణి, జిల్లా గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ మాట్లాడుతూ ఈ క్యాంపు వల్ల గత 2 సంవత్సరాల నుండి దాదాపు నల్లగొండ జిల్లాలో 12 మంది, లీగ్ కు 5 మంది స్టేట్ కు కావడం జరిగింది. ప్రతిభ చూపిన యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడాకారులు రోహిత్, క్రాంతి, లక్ష్మణ్, వేణు, మహేష్ అభినందించారు. ఇంచార్జి అబోతుల కేతన్, కోచ్ సతీష్ లు సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.