దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతిక. చంద్రముఖి వంటి వైవిధ్యమైన పాత్రలతో కోట్ల మంది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఈ నటి, సౌత్లో స్టార్ హీరోయిన్గా ఎదగడానికి ముందు కొన్ని చేదు అనుభవాలను తాజాగా పంచుకున్నారు. ఆమె వెండితెరపై కథానాయికగాపెట్టింది బాలీవుడ్లోనే కావడం విశేషం. 1998 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ‘డోలి సజాకే రచన’ అనే హిందీ చిత్రంతో జ్యోతిక హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా హీరోగా నటించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అనియతిప్రరావు’ అనే చిత్రం తాజాగా వచ్చినప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచింది.
సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోడానికి బాలీవుడ్ పరిశ్రమ ఆమె పట్ల చాలా కఠినంగా ప్రవర్తించింది. ఒకే ఒక్క ఫ్లాప్ పడిందన్న కారణంతో జ్యోతికకు హిందీ చిత్ర పరిశ్రమలో మరో అవకాశం ఇవ్వకుండా బాలీవుడ్ తన తలుపులను పూర్తిగా మూసేసింది. బాక్సాఫీస్ నెంబర్ల ఆధారంగానే నటినటుల భవిష్యత్తును నిర్ణయించే ఆ సంస్కృతి వల్ల జ్యోతిక ముంబై సినీ పరిశ్రమకు దూరం కావాల్సి వచ్చింది. అదే సమయంలో ఆమె టాలీవుడ్, కోలీవుడ్ వైపు అడుగులు వేశారు. ఆశ్చర్యకరంగా, తమిళంలో ఆమె చేసిన మొదటి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కానీ, అక్కడి పరిశ్రమ జ్యోతికను ఒదులుకోలేదు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆమె నటనలోని ప్రతిభను చూసి తమిళ సినీ వర్గాలు ముగ్ధులయ్యారు. ఆ ఒక్క సినిమా ఫ్లాప్ అయినా, ఆమెకు వరుసగా అరడజనుకు పైగా కొత్త సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చాయి.
ఈ విభిన్నమైన అనుభవాల గురించి జ్యోతిక మాట్లాడుతూ, రెండు పరిశ్రమల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని ఎత్తిచూపారు. బాలీవుడ్ తన ముఖం మీదే తలుపులు వేస్తే, సౌత్ ఇండస్ట్రీ మాత్రం తన ప్రతిభను గుర్తించి ఆదరించిందని కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. చెన్నై నగరం తనకు అన్నం పెట్టడమే కాకుండా, సూర్య వంటి మంచి వ్యక్తితో వివాహం జరిగి అందమైన కుటుంబాన్ని కూడా ఇచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. దక్షిణాదిలో ఆమె మూగ, చెవుడు, అంధురాలిగా ఎన్నో విలక్షణమైన, సవాలుతో కూడిన పాత్రలను పోషించి, 5 సార్లు ప్రతిష్టాత్మకమైన తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును అందుకుని రికార్డు సృష్టించారు. 2000వ దశకంలో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ మరియు క్రేజ్ సంపాదించుకున్నారు.
దాదాపు 26 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జ్యోతిక మళ్లీ బాలీవుడ్లోకి ఘనంగా పునరాగమనం చేశారు. ఇటీవలే ఆమె నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘సైతాన్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే ఆమె ‘సిస్టమ్’, ‘డబ్బా కార్టెల్’ వంటి సరికొత్త ప్రాజెక్ట్లతో హిందీలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో 40 ఏళ్లు దాటిన మహిళా నటిమణుల కోసం ఎంతో వైవిధ్యమైన మరియు బలమైన స్క్రిప్ట్లు రాస్తున్నారని, ఈ విషయంలో సౌత్ ఇండస్ట్రీ ఇంకా మారాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే సౌత్లో షూటింగులు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటలకే ప్యాకప్ చెప్తారని, ఇటువంటి పని గంటల సంస్కృతి మహిళలకు, ముఖ్యంగా తల్లులకు ఎంతో అవసరమని జ్యోతిక స్పష్టం చేశారు.