Home సినిమా దేహమంతా గాయాలే.. తెలుగు నటి ట్విషా శర్మ పోస్ట్‌మార్టంలో షాకింగ్ విషయాలు – Andhra Waves

దేహమంతా గాయాలే.. తెలుగు నటి ట్విషా శర్మ పోస్ట్‌మార్టంలో షాకింగ్ విషయాలు – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


మాజీ మిస్‌, ప్రముఖ నటి ట్విషా శర్మ(Twisha sharma)అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం ఐదు నెలల క్రితం, అంటే 2025 డిసెంబర్‌లో భోపాల్‌కి చెందిన లాయర్ సమర్థ్ సింగ్‌ని వివాహం చేసుకున్న ట్విషా, మే 12 రాత్రి భోపాల్‌లోని కటారా హిల్స్ నివాసంలో విగతజీవిగా కనిపించింది. వరకట్న వేధింపుల వల్లే జరిగిన హత్య అంటూ తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మరో వైపు ట్విషా శర్మ అత్త, రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతు ట్విషా కి డ్రగ్స్ అలవాటు లేదని, గంజాయి తీసుకుంటున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆల్ ఇండియా ఇన్ డిగ్రీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) భోపాల్ ఫోరెన్సిక్ నిపుణులు విడుదల చేసిన పోస్ట్‌మార్టం నివేదిక ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపుగా మారింది. ట్విషా శర్మ మృతికి గల అసలు కారణాలను ఈ పోస్ట్‌మార్టం నివేదిక వివరాలు.

ఎయిమ్స్ భోపాల్ పోస్ట్‌మార్టం నివేదిక ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేసింది. ట్విషా శరీరంలో ఎలాంటి డ్రగ్స్ లేదా నార్కోటిక్ పదార్థాలు లేవని నివేదికలో స్పష్టమైంది. మే 12వ తేదీ రాత్రి 10 గంటల 26 నిమిషాల ప్రాంతంలో ఇంటి టెర్రస్‌పై ఉన్న జిమ్నాస్టిక్ రింగ్ తాడుకు ట్విషా వేలాడుతూ కనిపించిందని నివేదించింది. అనంతరం అర్ధరాత్రి దాటాక మే 13 తెల్లవారుజామున ఆమె మరణించినట్లు వైద్యులు గుర్తించారు. గొంతు పైభాగంలో రెండు ఎర్రటి తాడు గుర్తులు (లిగేచర్ గుర్తులు) స్పష్టంగా ఉన్నాయని, మెడ వెనుక భాగంలో ఈ గుర్తు పూర్తి కాలేదని నివేదించబడింది. ఇది సాధారణంగా ఉరి వేసుకున్నప్పుడు జరిగే ప్రక్రియను సూచిస్తుంది.

అదనంగా, ఊపిరి ఆడకపోవడం (ఆస్పిక్సియా) వల్ల ముఖం ఉబ్బిపోవడం, గోళ్లు, చెవులు నీలిరంగులోకి మారడం వంటి లక్షణాలను గుర్తించారు. అయితే, ట్విషా శరీరంలో కేవలం ఊరి గుర్తులు మాత్రమే కాకుండా, మొండి వస్తువుల వల్ల తగిలిన కొన్ని సాధారణ గాయాలు (మొద్దుబారిన గాయాలు) కూడా గుర్తించబడ్డాయి పోస్ట్‌మార్టం నివేదికలో రికార్డ్ కావడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ట్విషా మరణానికి ముందు తీవ్రమైన మానసిక వేదన అనుభవించిందని, ఆమె భర్త కుటుంబం అదనపు కట్నం కోసం వేధించిందని తండ్రి నవనిధి శర్మ ఆరోపిస్తున్నారు. స్థానిక భోపాల్ పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, అందుకే ఢిల్లీ ఎయిమ్స్‌లో రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని వారు కోర్టును ఆశ్రయించారు.

ఇది కూడా చదవండి: డ్రాగన్: ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు LUGER వెనుక ఉన్న రహస్యం ఇదేనా! అసలు టార్గెట్ ఎవరు

ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న భర్త సమర్థ్ సింగ్ కోసం 6 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అతనిపై పోలీసులు 10,000 రివార్డు కూడా ప్రకటించారు. అతను దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని కూడా సంప్రదించారు. సీసీటీవీ ఫుటేజీలో ట్విషా ఒంటరిగా టెర్రస్ పైకి వెళ్లడం, ఆ తర్వాత 57 నిమిషాల అనంతరం ఆమెకు సీపీఆర్ (CPR) చేయడానికి ప్రయత్నించిన దృశ్యాలు బయటపడ్డాయి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird