ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన భూమా కుటుంబం నుంచి మరో వారసురాలు రాజకీయాల్లో అడుగుపెట్టారు. దివంగత దంపతులు మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల చిన్న కుమార్తె మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్దమవుతున్నారు. ప్రస్తుత ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అఖిలప్రియకు స్వాయానా చెల్లెలు అయిన మౌనిక పొలిటికల్ ఎంట్రీపై ఆమె భర్త, హీరో మంచు మనోజ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు.
తన భార్య మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలిపారు. తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి మనోజ్ దంపతులు ఇటీవల ఐక్య సంస్థను ప్రారంభించారు. ఈ నెల 20న తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్ ఐక్య సంస్థపై ఉన్న పలు సందేహాలపై క్లారిటీ ఇచ్చారు. ఐక్య సంస్థ రాజకీయ సంస్థ కాదని, ప్రజల వైపు మాట్లాడే గొంతుకగా ఉండేందుకు ఈ సంస్థను ప్రారంభించామన్నారు.
దాని కార్యకలాపాల కోసం సొంత నిధులను ఉపయోగించనున్నామని, తన భార్య మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా.. మీ తండ్రితో ఉన్న గొడవ సద్దయ్యాయా? అన్న ప్రశ్నకు ‘అది ఎవరిని అడగాలో మీకు తెలుసు. మైక్తో వెళ్లకండి.. వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి’ అని సరదాగా అనిపించింది. అదాలా ఉంటే మౌనిక ఎంట్రీ టీడీపీ నుంచే ఉంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
