శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. దుబాయ్కు ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమైన ప్రయాణికుల వద్ద నుంచి 28 లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేయడం వలన కస్టమ్స్ అధికారులకు ప్రయాణికుల ప్రవర్తనపై అనుమానం కలగడంతో వారిని ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీలో విదేశీ కరెన్సీ బయటపడింది. అవసరమైన అనుమతులు లేకుండా భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ తీసుకెళ్లడం చట్ట వ్యతిరేకం కావడంతో ఆ కరెన్సీని స్వాధీనపరుచుకున్నారు.. ప్రయాణికులపై కస్టమ్స్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
