ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ మ్యాచ్ పరంగానే కాకుండా వ్యక్తిగత విభేదాల పరంగానూ హాట్ టాపిక్గా మారింది. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు, అన్నదమ్ములు అయిన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా మధ్య విభేదాలు పొడసూపినట్లు మైదానంలో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ సోదరులు ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోకపోవడం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది.
ఈ మ్యాచ్లో కర్నాల్ పాయా ఆర్సీబీ తరపున పోటీ పడుతుండగా, హార్దిక్ ముంబై ఇండియన్స్కు సారథ్యం వహించాడు. ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ క్రీజులోకి రాగానే కృనాల్ తన బౌలింగ్తో స్వాగతం పలికాడు. అయితే గతంలో లాగా ఇద్దరూ నవ్వుతూ మాట్లాడకుండా చాలా సీరియస్గా కనిపించారు. ముఖ్యంగా కర్నాల్ సంధించిన ఒక బౌన్సర్కు హార్దిక్ చాలా ఘాటుగా స్పందించడం.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జాకోబ్ డఫీ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా అవుట్ అయిన సమయంలో కృనాల్ పాండ్యా ఎగిరి గంతేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అవుట్ అయితే ఆనందించడం సహజమే అయినా, తన సొంత తమ్ముడు అవుటైనప్పుడు కృనాల్ చూపించిన ఆవేశం చూస్తుంటే వారి మధ్య ఏదో పెద్ద గొడవ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరు సంప్రదాయబద్ధంగా కరచాలనం చేసుకోకుండానే విడిపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.
ఈ గ్యాప్కు కారణం హార్దిక్ వ్యక్తిగత జీవితమే అని ప్రచారం సాగుతోంది. నటాషా స్టాంకోవిచ్తో విడాకుల తర్వాత హార్దిక్ ప్రవర్తన పట్ల కుటుంబం అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. కృష్ణ భార్య నటాషాతో ఇప్పటికీ సన్నిహితంగా ఉండటం, హార్దిక్ మరో కొత్త స్నేహితురాలితో కనిపించడం అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టినట్లు సమాచారం. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా కృనాల్ తన తమ్ముడికి సోషల్ మీడియాలో విష్ చేయకపోవడం అప్పట్లో చర్చకు దారితీసింది.
ప్రస్తుతం ఆర్సీబీ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుండగా, హార్దిక్ సారథ్యంలోని ముంబై వరుస ఓటములతో కుదేలవుతోంది. ఈ వ్యక్తిగత విభేదాలు కూడా హార్దిక్ మీద ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఈ మధ్య దూరం తగ్గుతుందా లేక ఇద్దరిముందు ఈ కోల్డ్ వార్ ఇంకా ముదురుతుందా అనేది వేచి చూడాలి. రానున్న మ్యాచుల్లో ఈ పాండ్యా సోదరుల వ్యవహారశైలిపై క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా దృష్టి సారిస్తోంది.
