హైదరాబాద్లో చికెన్ వ్యాపారులు నిరసన బాట పట్టారు. లాభాలు లేకపోవటం, పెరుగుతున్న ఖర్చులు, అప్పుల భారం పెరగడం కారణంగా చికెన్ ఉత్పత్తుల నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన వ్యాపారులు ఈ మేరకు ఉత్పత్తుల ముందు బ్యానర్లు ఏర్పాటు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల మేత ధరలు, రవాణా ఖర్చులు, కార్మిక వ్యయం పెరగడం వల్ల ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు. ఈ పరిస్థితు ల్లో చాలా మంది చికెన్ వ్యాపారులు అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యం లోనే ఏప్రిల్ 1, 2026 నుండి తమ సాంకేతికతను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో రాష్ట్రవ్యా ప్తంగా ఈరోజు ఉదయం నుండి చికెన్ సెంటర్ల బంద్ కొనసాగుతోంది. కాగా ఎల్బీనగర్ ఓ చికెన్ అవుట్లెట్ యజమాని షాప్ తెరిచి విక్రయాలు సాగిస్తున్న విషయం తెలుసుకున్న చికెన్ అసోసియేషన్ సభ్యులు అక్కడకు చేరుకుని రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నది షాప్ మూసేయాలని.
ఈ సందర్భంగా ఆ షాప్ యజమాని వారితో వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ కోరిక ఆ పాష్ లో ఉన్న కోడిగుడ్ల ట్రేలను అసోసియేషన్ సభ్యులు బయటకు విసిరారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకున్నారు.
.webp)