జగిత్యాల ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అపశృతి కనిపించింది. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిరి అకస్మాత్తుగా కూలిపోవడంతో సుమారు 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.హనుమాన్ విజయోత్సవం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు.
ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో తాత్కాలికంగా చలువ పందిరి ఏర్పాటు చేశారు. అయితే అలా ఏర్పాటు చేసిన చలవ పందిరి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో గాయపడిన భక్తులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒకింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చలువపందిరి కూలిన ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకంగా ఈ చలువపందిరి వేయడం వల్లనే కుప్పకూలిందని ఆరోపిస్తున్నారు. అధికారులు స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చలువ పందిరి కూలిన ఘటనపై వాచారణ జరిగింది.
