మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు పాకిస్థాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులు పాకిస్థాన్ రాయబార కార్యాలయం సమీపంలో సంభవించడంతో ఇస్లామాబాద్ తీవ్ర స్థాయిలో స్పందించింది. తమ దౌత్యవేత్తలకు ఏమాత్రం హాని తలపెట్టినా సహించేది లేదని, తమను తక్కువ అంచనా వేయకూడదని ఇజ్రాయెల్ను పాక్ హెచ్చరించింది.
గత రాత్రి టెహ్రాన్లోని పాస్దారన్ జిల్లాలో ఉన్న పాక్ రాయబార కార్యాలయం, అలాగే రాయబారి నివాసానికి అతి సమీపంలో శక్తివంతమైన బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం లక్ష్యంగా చేసుకున్న కొన్ని ప్రాంతాలు పాక్ దౌత్య సముదాయానికి సమీపంలో ఉండటంతో ఆ భవనాలు భారీ శబ్దాలతో దద్దరిల్లాయి. ఈ ఘటనలో పాక్ రాయబారి ముదస్సి టిపుతో పాటు ఇతర సిబ్బంది సురక్షితంగా ఉండటం, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండటంతో పాక్ ప్రభుత్వం అగ్గిమీద గుగ్గిలమవుతోంది.
ఈ పరిణామంపై పాకిస్థాన్ స్ట్రాటజిక్ ఫోరం ఘాటుగా హెచ్చరికలు జారీ చేసింది. తమ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే దీటుగా బదులిస్తామని హెచ్చరించింది.
ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. టర్కీ, ఈజిప్టు దేశాలతో కలిసి ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ కోసం 15 పాయింట్ల ప్రణాళికను పాక్ ప్రతిపాదించింది. ఇటువంటి కీలక సమయంలో తమ రాయబార కార్యాలయం సమీపంలో దాడులు జరగడం పట్ల పాక్ విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
మరోవైపు ఇజ్రాయెల్ తన దాడులను మరింత ఉధృతం ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్లోని క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ పరిశీలిస్తోంది. అయితే, ఈ దాడులు జనసాంద్రత కలిగిన దౌత్య ప్రాంతాలకు దగ్గరగా జరగడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యుద్ధం ప్రారంభమైన 28 రోజులుగా టెహ్రాన్ నగరం నిరంతర దాడులతో అట్టుడుకుతోంది. పాకిస్థాన్లో ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏ చిన్న పొరపాటు జరిగినా అది మరో భారీ ప్రమాదానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇస్లామాబాద్ తన దౌత్య కార్యకలాపాలను ఇతర ప్రాంతాలకు మారుస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
