ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను పులి భయం వదలడం లేదు. తాజాగా రెండు రోజులుగా పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో పెద్దపులి సంచారం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పులిని ఇటీవలే శాఖ అధికారులు పట్టుకుని పాపికొండలు అభయారణ్యంలో వదిలిపెట్టారు. అదే పులి అంతలోనే మళ్లీ జనావాసాలవైపుగా కదలడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ పులి సంచారాన్ని రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల పరిధిలోని పట్టణంలోని శాఖ అధికారులు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పశువులపై దాడి చేసిన ఈ పులిని అధికారులు ఈ నెల మొదటి వారంలో పాపికొండలు అభయారణ్యంలో వదిలిన సంగతి తెలిసిందే. అయితే అదే పులి మళ్లీ జనావాసాలవైపు కదలడంతో జనం భయంతో వణికిపోతున్నారు. ఇలా పులి సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఉండగా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
