Home Latest News ఆసీస్‌పై భారత్ ఘన విజయం…సిరీస్ కైవసం | మూడో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం| భారత మహిళా జట్టు| అడిలైడ్| ఆస్ట్రేలియా| స్మృతి మంధాన| జెమీమా రోడ్రిగ్స్| రిచా ఘోష్| యాష్లే గార్డనర్| శ్రీ చరణి| బీసీసీఐ| ICCI – Andhra Waves

ఆసీస్‌పై భారత్ ఘన విజయం…సిరీస్ కైవసం | మూడో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం| భారత మహిళా జట్టు| అడిలైడ్| ఆస్ట్రేలియా| స్మృతి మంధాన| జెమీమా రోడ్రిగ్స్| రిచా ఘోష్| యాష్లే గార్డనర్| శ్రీ చరణి| బీసీసీఐ| ICCI – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఆడిలైడ్ వేదికగా జరిగిన మూడో టీ20 భారత్ మహిళ జట్టు ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై భారత్‌కు ఇదే తొలి సిరీస్. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. స్మృతి మంధాన (82 పరుగులు), జెమిమా రోడ్రిగ్స్ (59 రన్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. షఫాలీ వర్మ (7 పరుగులు), రిచా ఘోష్ (18 పరుగులు) విఫలమయ్యారు.

ఆసీస్ బౌలర్లలో అనబెల్ సుదర్లాండ్ 2, సోఫీ, కిమ్ గార్ట్ చెరో 1 వికెట్ పడగొట్టారు.177 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన కంగారులు 159/9 పరుగులకే చేసింది. అష్లీ గార్డ్‌నర్ (57 పరుగులు) మాత్రమే రాణించింది. భారత బౌలర్లలో శ్రేయాంకా పాటిల్, శ్రీ చరణి చెరో 3, అరుంధతి రెడ్డి 2, రేణుకాసింగ్ ఠాకూర్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ గెలవగా, రెండో టీ20లో ఆసీస్ విజయం సాధించింది. ఇక సిరీస్ డిసైడర్ అయిన తాజా టీ20లో నెగ్గిన టీమ్‌ఇండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird