హైదరాబాద్ మహానగర పాలక సంస్థను మూడు కార్పొరేషన్లుగా విభజించి చాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి చట్టపరమైన సవాల్ ఎదురైంది. ఈ మేరకు జారీ చేసిన జీవో నెంబర్ 55ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గురువారెడ్డి అనే వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేయగా, విచారణకు తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరపున న్యాయ వాది కోర్టుకు వివరించిన అంశాలు ఈ కేసులో ప్రధానంగా నిలిచాయి. 2027 జనగణన నేపథ్యంలో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ నంబర్ 01 ప్రకారం ప్రస్తుతం జ్యూరి స్డిక్షన్ ఫ్రీజ్ అమల్లో ఉందని పేర్కొన్నారు. ఈ ఫ్రీజ్ కాలంలో మున్సిపల్ సరిహద్దులను మార్చడం, స్థానిక సంస్థలను పునఃవ్యవస్థీకరించడం చట్టం విరుద్ధమని వాదించారు.
జీహెచ్సీ వంటి భారీ స్థానిక సంస్థను విభజిం చడం ద్వారా పరిపాలన పరిధులు మారతాయని, ఇది సర్క్యులర్ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అందువల్ల జీవో నెంబర్ 55ను తక్షణమే రద్దు చేసింది. పిటిషనర్ వాదనలు విన్న తరువాత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ తమ వాదనలు వెల్లడించాలని ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. దాఖలైన తర్వాత తదుపరి విచారణ కౌంటర్ చేపడతామని ధర్మాసనం అందించింది. జీహెచ్సీ విభజన అంశం ఇప్పటికే పాలన, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చలకు దారితీసింది. మహానగర పరిపాలనను నిర్వహించేందుకు వీలుగా విభజన అవసరమని ప్రభుత్వం భావించడం, చట్టపరమైన పరిమితులు, జనగణన ప్రక్రియపై ప్రభావం వంటి అంశాలు ఇప్పుడు హైకోర్టు ముందు నిలిచాయి.
హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం కీలక దశకు చేరుకుంది. కేంద్రం, రాష్ట్రం సమర్పించే కౌంటర్లలో ప్రభుత్వ వైఖరి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. జీహెచ్సీ పునర్వ్యవస్థీకరణపై హైకోర్టు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో రాష్ట్రంలో స్థానిక సంస్థల పునర్విభజనకు మార్గదర్శకంగా ఉండే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో హైకోర్టు తదుపరి రాజకీయ, పరిపాలనా, న్యాయ వర్గ తీవ్ర ఉత్కంఠ.
