బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా పార్టీ నేతలంతా ఫార్ములా ఈ రేస్ కేసును లొట్టపీసు కేసు అంటూ ఎంత తక్కువ చేసి మాట్లాడాలని చూసినా అది గట్టి కేసునని న్యాయనిపుణులు అంటున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి లభించింది. ఈ కీలక పరిణామంతో తెలంగాణ ఏసీబీ ఫార్ములా ఈ రేసు విచారణను మరింత వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కేసులో మాజీ ప్రాసిక్యూషన్కు గవర్నర్ ఎప్పుడో అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఇదే కేసులో అరవింద్ కుమార్ విచారణకు కేంద్రం నుంచి అనుమతి లభించడంతో ఇక ఏ క్షణంలోనైనా ఆయనను విచారణకు పిలవడం, ఈ కేసులో చార్జిషీట్ దాఖలు కావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించేందుకు కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. రూ.54.88 కోట్ల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు తరలించడంలో అరవింద్ కుమార్ పాత్ర పోషించారని, ముఖ్యంగా కేటీఆర్ ప్రకారం క్యాబినెట్ ఆమోదం లేకుండానే దస్త్రాలను వేగంగా కదిలించారని ఏసీబీ ఆరోపిస్తోంది.
ఈ లావాదేవీల వల్ల ప్రభుత్వ ఖజానాకు కేవలం నిధుల పరంగానే కాకుండా, జరిమానాల రూపంలోనూ భారీ నష్టం వాటిల్లిందని ఏసీబీ ఆధారాలు సేకరించింది. అదాలా ఉంటే.. ఈ కేసులో అరవింద్ కుమార్ అప్రూవర్ గా మారే అవకాశాలపై రాజకీయ, అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కెరీర్ , భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే.. ఈ కేసులో తాను పైస్థాయిని అమలు చేశానని చెబుతూ, అసలు సూత్రధారుల వివరాలను వెల్లడించేందుకు ఆయన సిద్ధమయ్యే అవకాశం మెండుగా ఉన్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే.. ఈ కేసులో ఏ1 కేటీఆర్కు ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు అంటున్నారు.
