Home Latest News మోడీ స్ఫూర్తితోనే ఆత్మీయ పలకరింపు.. నారా లోకేష్ | మోడీ స్ఫూర్తితో హృదయపూర్వక శుభాకాంక్షలు| నారాలోకేష్| విందు| సమావేశాలు| పార్టీ – Andhra Waves

మోడీ స్ఫూర్తితోనే ఆత్మీయ పలకరింపు.. నారా లోకేష్ | మోడీ స్ఫూర్తితో హృదయపూర్వక శుభాకాంక్షలు| నారాలోకేష్| విందు| సమావేశాలు| పార్టీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేతల కుటుంబాలతో తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ పలకరింపుకు మోడీ యే స్ఫూర్తి అని మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం (ఫిబ్రవరి 14) అసెంబ్లీ ఆవరణలో నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఎంత ప్రస్తుతం ఉన్నా ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలలో ఉండాలన్నదే తన అభిప్రాయమన్నారు. రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత ముఖ్యమో, నేతలతో ఆత్మీయ పలకరింపు కూడా అంతే ముఖ్యమన్న లోకేష్ అంతటితో ఆగకుండా.. ఏఐ క్వాంటం ఎంత అవసరమో మనవీయ సంబంధాలు అంతే అవసరమని చెప్పారు. కుటుంబాలతో బంధం కోసమే డిన్నర్ సమావేశాలని చెప్పారు. క్వాంటం, ఏఐలు సీఎం చంద్రబాబు చూసుకుంటారనీ, తాను మానవీయ సంబంధాలు చూసుకుంటానన్నారు.

అందుకే బడ్జెట్ సమావేశాలప్పుడైనా ఇలా నేతలందరితో ఏటా కలిసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఇంక తాను బరువు తగ్గడం గురించి మాట్లాడుతూ.. మరో రెండు కిలోల బరువు తగ్గితే తాను లక్ష్యం చేరుకుంటానని చెప్పారు. ఇక సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమన్నది తనకు ప్రతిపక్షంలో ఉండగా అలవాటైపోయింది. ఏ అంశంపైనైనా పార్టీ నిర్ణయం తీసుకునే వరకూ అభిప్రాయాలు బలంగా వినిపించవచ్చన్న లోకేష్.. ఒక సారి పార్టీ నిర్ణయం తీసుకున్న తరువాత దానికి కట్టుబడాల్సిందేనన్నారు. ఈ నెల 28న యలమంచిలిలో బ్లూజెట్ పరిశ్రమ శంకుస్థాపనపై మాట్లాడుతూ, ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి 2,300 కోట్ల రూపాయల పెట్టుబడి రానుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird