ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎక్సైజ్ కోర్టులో అధికారులు గురువారం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు అందించారు ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు. ఈ కేసు విచారణను ఫిబ్రవరి 23వ తేదీకి ఎక్సైజ్ కోర్టు వాయిదా వేసింది. మరోవైపు లిక్కర్ స్కాం నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్ప ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం నాడు ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు.. ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. అలాగే వీరి బెయిల్పై కౌంటర్ దాఖలు చేయడానికి సిట్ను ఏసీబీ కోర్టు ఆదేశించింది.
.webp)