ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల తొలి రోజున వైసీపీ ఎమ్మెల్యేలు 11 మందీ (జగన్ సహా) అసెంబ్లీకి హాజరైన 11 నిముషాలు సభలో ఉండి వాకౌట్ చేయడం. వాకౌట్ తరువాత సభ బయటకు వచ్చిన జగన్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులుతో ప్రత్యేకంగా మాట్లాడారు. దగ్గరకు పిలిచి.. మరీ ఆయనతో కొద్ది సేపు ముచ్చటించారు. ఈ సారి దువ్వాడను ఒక తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి కలవమని కూడా పట్టుకున్నారు.
రాజకీయవర్గాలనే కాకుండా ఈ సంఘటన వైసీపీలను కూడా విస్మయపరిచింది. ఎందుకంటే దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడానికి ఎన్ని కబుర్లు చెప్పినా ఆయనకు ధర్మాన ప్రసాదరావుతో విభేదాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా అదే కారణం అంటున్నారు.
అది పక్కన పెడితే జగన్ దువ్వాడతో ఇక నుంచీ పార్టీ గొంతు బలంగా వినిపించాలని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ఇక దువ్వాడ సస్పెన్షన్ ను ఎత్తివేయడం ఖాయమన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దువ్వాడలా నోరు గట్టిగా పారేసుకోగల వ్యక్తులకు చాలా అవసరమని జగన్ కోరుకుంటున్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత కూడా ఇప్పటి వరకూ జగన్ కు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడని దువ్వాడపై సస్పెన్షన్ ఎత్తివేసి కీలక బాధ్యత అప్పగించాలని జగన్ కోరుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సస్పెన్షన్ లో ఉండి కూడా దువ్వాడ లడ్డూ వివాదంపై అధికార కూటమి నేతలపై గట్టిగానే నోరు పారేసుకున్నారని అంటున్నారు.
ఇది పక్కన పెడితే జగన్ దువ్వాడను దువ్వి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి కలవమనడం చూస్తుంటే.. జగన్ పార్టీలో సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ లకు చెక్ పెట్టే ఉద్దేశంలో ఉన్నారా అన్న అనుమానాలు వైసీపీ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. ధర్మాన బ్రదర్స్ జిల్లాకే చెందిన దువ్వాడను ప్రోత్సహించడం ద్వారా వారికి చెక్ పెట్టాలని, పార్టీలో వారి ప్రాధాన్యత తగ్గించాలని జగన్ ఇష్టపడే ప్రచారం కూడా. చూడాలి మరి దువ్వాడ ఎంట్రీ ధర్మాన సోదరులపై పార్టీలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో?
