Home Latest News ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం.. క్యాన్సర్ గురించి తాజాగా బయటపడిన షాకింగ్ నిజం..! | ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం| ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ప్రసంగం| క్యాన్సర్ పై అవగాహన పెంచుకోండి| క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థలకు మద్దతుగా| ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కథ – Andhra Waves

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం.. క్యాన్సర్ గురించి తాజాగా బయటపడిన షాకింగ్ నిజం..! | ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం| ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ప్రసంగం| క్యాన్సర్ పై అవగాహన పెంచుకోండి| క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థలకు మద్దతుగా| ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కథ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


క్యాన్సర్.. ప్రపంచ వ్యాప్తంగా అదిక శాతం జనాభాను కుదిపేస్తున్న ఆరోగ్య సమస్య. క్యాన్సర్ వచ్చింది అంటే ఇక చావు ఖాయం అని అనుకుంటారు. ఒక వేళ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా.. దీని చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలు మనుషుల మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. క్యాన్సర్ గురించి అవగాహన పెంచేందుకు, ప్రజలను అప్రమత్తం చేస్తారు ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఒక షాకింగ్ నిజం బయటపడింది. 2045 నాటికి భారతదేశంలో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రతి ఏటా 1.5 మిలియన్ల నుండి 2.45 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలో క్యాన్సర్ అనేది ప్రధానమైన, తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

భారతదేశంలో క్యాన్సర్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతోందని నిపుణులు, నిపుణులు చెబుతున్నారు. 2045 నాటికి ప్రతి ఏడాది నమోదు అయ్యే క్యాన్సర్ కేసులు 15 లక్షల నుండి 24 లక్షల 50 వేల వరకు పెరుగుతాయని అంచనాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి క్యాన్సర్ ఎంత ఉదృతంగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి ఆరోగ్య నిపుణులు, ప్రభుత్వాలు కూడా ఆలోచనలో పడ్డాయి.

ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలామంది క్యాన్సర్ ఉందని తెలిసిన తరువాత, కోట్లు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం అనే విషయం మీదే ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ క్యాన్సర్ వచ్చిన తరువాత వైద్యం గురించి ఆలోచించడం.. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించే దిశగా మంచిదని చెబుతున్నారు.

చికిత్సకు మాత్రమే సరైన మార్గం కాదు.. దీని కోసం ముందస్తు స్క్రీనింగ్‌కు హాజరు కావడం, జీవనశైలి, జీవనశైలిని మెయింటైన్ చేయడం, క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవడం, శరీరంలో ఏదైనా క్యాన్సర్ ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించినా, ఎక్కడైనా అసాధారణంగా గడ్డలు, చర్మం రంగు మారడం, శరీరంలో మార్పులు జరుగుతున్నప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించడం జరుగుతుంది. ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్‌కు ఖరీదైన చికిత్స అనే వరకు వెళ్లకుండా దాన్ని విత్తనం దశలోనే నిర్మూలించేందుకు వీలవుతుంది. పైగా ఇలాంటి పరిస్థితిలో క్యాన్సర్ ను నయం చేయడం కూడా తక్కువ ఖర్చులోనే జరిగిపోతుంది.

ప్రభుత్వ విధానాలు..

తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో క్యాన్సర్ చికిత్సను తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీ మినహాయింపులు, దేశీయ బయోపార్మాస్యూటికల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం బడ్జెట్‌లో ఉంది.

ప్రజలు చేయాల్సినది..

క్యాన్సర్ అనేది భారతదేశంలో ఎవరికైనా రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు.. కానీ కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ గురించి ప్రతి వ్యక్తి తనకు తాను జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీనింగ్ కు హాజరు కావాలి, శరీరంలో ఏ మార్పును నిర్లక్ష్యం చేయకూడదు, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ప్రకృతికి దగ్గరగా గడపడం వంటివి చేయాలి. ఇలా చేస్తే ఎవరికి వారు క్యాన్సర్ నుండి దూరంగా ఉండవచ్చు.

*రూపశ్రీ.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird